English | Telugu

Brahmamudi : రుద్రాణి ప్లాన్ కి స్వరాజ్ బ్రేక్.. రేవతిపై ఆ నింద పడనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -822 లో.....రుద్రాణి తీర్థంలో ఏదో మందు కలుపుతుంది. అది అప్పు కావ్య తాగితే వాళ్ళ ప్రెగ్నెంట్ పోతుందని ప్లాన్ చేస్తుంది. రుద్రాణి అది కలిపి వెనక్కి తిరుగుతుంది. అక్కడ స్వరాజ్, కనకం ఉంటారు. వాళ్ళు చూసారేమోనని భయపడుతుంది.. కానీ వాళ్ళు చూడరు. నాకు జ్యూస్ తీసుకొని రమ్మన్నాను కదా ఇంకా తీసుకొని రావడం లేదేంటని రుద్రాణిని స్వరాజ్ అడుగుతాడు. నువ్వు ఇప్పుడు జ్యూస్ తీసుకొని రాకపోతే మా ఫ్రెండ్ కి చెప్తానని బెదిరిస్తాడు. దాంతో రుద్రాణి సరే అంటుంది.

ఆ తర్వాత వినాయకుడి పూజ జరుగుతుంది. తీర్థం పంతులు అందరికి ఇస్తాడు. కావ్యకి ఇవ్వబోతుంటే అప్పుడే స్వరాజ్ తీర్థానికి తాకుతాడు.. అది కిందపోతుంది. దాంతో స్వరాజ్ పై రుద్రాణి కోప్పడుతుంది. వేరొకరి ఇంటికి వచ్చినప్పుడు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని రేవతిపై కోప్పడుతుంది. బాబు ఏదో చూడకుండా చేసాడు. ఆ మాత్రం దానికే అంతలా అరవాలా అని రుద్రాణిపై అపర్ణ కోప్పడుతుంది. నువ్వు ఇప్పుడు స్వరాజ్ వాళ్ళ అమ్మకి సారీ చెప్పాలని అపర్ణ అనగానే రుద్రాణి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత కావ్య కిచెన్ లో ఉండగా.. రాజ్ వెనకాల నుండి వచ్చి ముద్దుపెడతాడు. ఏంటి ఇలా వచ్చారని కావ్య అడుగుతుంది. బెడ్ రూమ్ లో కొంచెం బ్యాలెన్స్ ఉండే కదా అని రాజ్ రొమాంటిక్ గా మాట్లాడతాడు. అప్పుడే ఇందిరాదేవి రావడంతో ఏదో కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తరువాయి భాగంలో స్వరాజ్ వాళ్ళు ఎవరో కనిపెట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. రేవతి బ్యాగ్ లో నగలు రుద్రాణి వేస్తుంది. అత్తయ్య నెక్లెస్ లేదని అపర్ణ దగ్గరికి కావ్య వస్తుంది. ఈ ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళ పని అయి ఉంటుందని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.