English | Telugu

Eto Vellipoindi Manasu : ఆ నగలు వేసుకున్న రామలక్ష్మి.. ఇంకా డౌట్ గానే ఉంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -66 లో.. నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు.. వాళ్ళని ఎలాగైనా దగ్గర చెయ్యాలని సిరి అనుకొని రామలక్ష్మికి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. గుడికి వెళ్తున్నాం కదా అంటు రామలక్ష్మికి సిరి గోరింటాకు పెడుతుంది. ఇప్పుడు అన్నయ్య నువు వదినకి టిఫిన్ తినిపించని చెప్పగానే సిరి మాట కాదనలేక రామలక్ష్మికి సీతాకాంత్ ప్రేమగా టిఫిన్ తినిపిస్తుంటాడు.

మరొకవైపు సీతాకాంత్ వాళ్ల అమ్మ నగలు శ్రీలత తీసుకొని రామలక్ష్మికి ఇవ్వాలనుకుంటుంది. ఎందుకని సందీప్ అడుగుతాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు పెళ్లి చేసుకున్నారో లేదో తెలియాలంటే.. ఇవి రామలక్ష్మికి ఇవ్వాలి. ఈ నగలు సీతాకాంత్ కి సెంట్ మెంట్ ఇవి రామలక్ష్మి తీసుకుంటుందో లేదో చూడాలని సందీప్ తో శ్రీలత అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్, పెద్దాయనలకి రామలక్ష్మి కాఫీ తీసుకొని వస్తుంటే.. మీ ఆవిడని చూడరా ఎంత లక్షణంగా ఉందోనని పెద్దాయన అంటాడు. అప్పుడే శ్రీలత.. రామలక్ష్మి, సీతాకాంత్ లని పిలుస్తుంది. ఈ నగలు సీత వాళ్ళ అమ్మవి.. ఈ ఇంటికి కోడలిగా, సీతకు భార్యగా ఈ నగలు నువ్వు వేసుకోవాలని శ్రీలత చెప్పగానే.. నాకు వద్దని రామలక్ష్మి చెప్తుంది. కానీ సీతాకాంత్ మాత్రం ఈ ఇంటి కోడలు అవి వేసుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత నువ్వే నీ భార్య మెడలో వెయ్యి అని శ్రీలత అనగానే.. రామలక్ష్మి మెడలో సీతాకాంత్ నగలు వేస్తాడు.

ఆ తర్వాత నగలు తీసుకుంది కదా అని శ్రీలతతో సందీప్ అనగానే.. డౌట్ పడుతూనే తీసుకుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత నాకు నగలు ఇవ్వలేదని శ్రీవల్లి ఫీల్ అవుతుంటే.. నేను వాళ్ళు పెళ్లి చేసుకున్నారో లేదో ఆ విషయం తెలుసుకోవడానికి అలా చేసాను.. నువ్వు కూడ వాళ్ళపై ఒక కన్ను వేసి ఉంచమని శ్రీవల్లికి శ్రీలత చెప్తుంది. మరొకవైపు అసలు సిరి, ధనల పెళ్లి అవుతుందో లేదోనని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. మీ చెల్లి కూడా టెన్షన్ పడుతుందని సీతాకాంత్ తో రామలక్ష్మి చెప్పగానే.. వెంటనే సిరి దగ్గరికి ఇద్దరు వెళ్తారు. ఎలాగైనా మీ పెళ్లి చేస్తాను నీకోసం ఏం చెయ్యడానికైనా రెడీ అని సిరికి సీతాకాంత్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.