English | Telugu

పల్లవి ప్రశాంత్, శివాజీలలో ఎవరో ఒకరే విజేత.. శోభాశెట్టి సెన్సేషనల్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్-7 లో‌ గత వారం రోజులుగా ఎన్నో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ దత్తపుత్రిక శోభాశెట్టిని ఎలిమినేట్ చేయరని అనుకున్నారంతా కానీ అందరికి ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చి ఎలిమినేట్ చేశాడు‌ బిగ్ బాస్. ఇక సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్, ప్రియాంక మిగిలారు. అర్జున్ గేమ్స్ లో గెలవడం వల్లే ఇప్పటిదాకా ఉన్నాడనేది వాస్తవం. లేదంటే అతని బిహేవియర్ కి ఎప్పుడో బయటకొచ్చేవాడు.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేముందు.. నేను తెలియక మిమ్మల్ని ఏం అయిన అని ఉంటే నిజంగా క్షమించండి అంటు శివాజీ కాళ్ళమీద పడింది శోభాశెట్టి. అయితే ఎలిమినేషన్ తర్వాత కొన్నిచోట్ల తన ఫ్యాన్స్ మీట్ అయ్యారు. అందులో కొందరు. ‌ ఎప్పుడో బయటకు రావాల్సింది. ఇప్పుడు వచ్చావంటూ కామెంట్ చేయగా శోభాశెట్టి అలియాస్ మోనిత ముఖం వాడిపోయింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కొన్ని రోజులు రెస్ట్ కావాలి. జనరల్ గా అయితే బెంగుళూరుకు వెళ్ళాలి కానీ ఫినాలే ఉంది కదా అని అంది. హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారని ఒకరు అడుగగా.. నాకేం తెలియదు. ఫినాలే వీక్ కదా, ఎవరేం మాట్లాడుతున్నారో? బయటకు ఎలా ప్రొజెక్ట్ అయిందో తెలియదని అసలేం గుర్తులేదని శోభాశెట్టి అంది. టైటిల్ విన్నర్ ఎవరని మీరనుకుంటున్నారని అడుగగా.. నాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే లోపల ఒకలా ఉంటుంది. బయట టీవీలో ఒకలా కన్పిస్తుందని అంది. బయట ఉన్న బజ్ ప్రకారం అమర్, ప్రశాంత్, శివాజీలలో ఒకరే టైటిల్ గెలుస్తారని అంటున్నారని ఒకరు అడుగగా.. అయ్యయ్యో అమర్ దీపా వాడెప్పపుడు ఫౌల్ గేమ్సే ఆడతాడు‌. వాడికి అంత లేదు‌‌. అయితే ప్రశాంత్, శివాజీలలో ఎవరో ఒకరే అని శోభాశెట్టి అంది.

భోలే షావలితో నామినేషన్ లో జరిగిన గొడవ మీకేమైనా నెగెటివ్ అవుతుందని అనుకున్నారా అని అడుగగా. ‌ అసలు అనుకోలేదని శోభా అంది. మోనితలాగా వాయిస్ పెద్దగా చేసి మాట్లాడటం వల్ల మీరు మరింత బ్యాడ్ అయ్యారని అనుకుంటున్నారా అని అడుగగా.. లేదంటి. అసలెప్పుడు అలా అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక అబ్బాయికి స్టాండ్ తీసుకున్నాను. అందుకే అంత గట్టిగా మాట్లాడాను‌. అబ్బాయి అయిన అమ్మాయి అయిన మాట్లాడొచ్చు ఎందుకంటే హౌస్ లో జెండర్ ఢఫరెన్స్ లేదు. శివాజీ మైండ్ గేమ్ ఆడుతున్నారని అనిపించిందా అని అడుగగా.‌. అని బిగ్ బాస్ హౌస్ అక్కడ స్ట్రాటజీ, మైండ్ గేమ్ అన్నీ ఉండాలి లేదంటే మనం ఉండలేం అక్కడ అని శోభా అంది. ఇక ఫైనల్ గా ఎవరికి మీ సపోర్ట్ అని అనగా‌‌.. అర్జున్, ప్రియాంకకి నా సపోర్ట్ అని శోభా అంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.