English | Telugu

శోభాశెట్టికి 30 లక్షలు ఇచ్చిన బిగ్ బాస్... ఎందుకో తెలుసా!

బిగ్ బాస్ సీజన్-7 లో మోస్ట్‌ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ శోభాశెట్టి ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ లోని వాళ్ళంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రేక్షకులైతే సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసిన శోభాశెట్టి ఎలిమినేషన్ అయిందని, ఇక నుండి బిగ్ బాస్ ని హ్యాపీగా చూడొచ్చని అంటున్నారు.

శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలంటూ గత కొన్నివారాలుగా ఆడియన్స్ తనకి అసలు ఓట్లే వేయకుండా లీస్ట్ లో ఉంచినా బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక శోభాశెట్టి ఎలిమినేషన్ కోసం ఎదురుచూసి, చూసీ జనానికి చిరాకు వచ్చేసింది. ఎంత చిరాకు వచ్చిందంటే.. ఫినాలే వీక్‌లో మొత్తానికి ఓట్లు వేయడమే మానేస్తున్నారు. శోభాశెట్టి వరుస సేవింగ్‌లతో ఎలిమినేషన్, ఓటింగ్‌లపై జనానికి నమ్మకం పోయింది. మనం ఓట్లేసిన బిగ్ బాస్ వాటిని లెక్కలోకి తీసుకోడుగా, అలాంటప్పుడు ఓట్లేసి ప్రయోజనం ఏముందని ఫినాలే వీక్‌లో ఓట్లు వేయడానికి జనం ఇష్టపడటం లేదు. ప్రతీ సీజన్‌లో అయితే.. పోటీ పడి ఓట్లు గుద్దేవారు చివరి వారాల్లో కానీ శోభాదెబ్బకి ఓట్లు వేయడానికి బిగ్ బాస్ రెగ్యులర్ గా చూసే ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. ఇక శోభాశెట్టి ఎలిమినేషన్ అయిందని వినగానే బిగ్ బాస్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేసుకుంటున్నారు.

శోభాశెట్టి హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక, అమర్‌దీప్,‌ టేస్టీ తేజలతో ఎక్కువ సమయం ఉంది. ఇక టేస్టీ తేజ బయటకొచ్చాక అమర్,‌ ప్రియాంకలతో కలిసి గ్రూప్ హా గేమ్ ఆడుతూ మిగిలిన హౌస్ మేట్స్ అందరిని టార్గెట్ చేయడం, వారితో గొడవకి దిగడం, కావాలని ట్రిగ్గర్ చేయడం, నోరేసుకొని పడిపోవడం లాంటివి చేయడంతో శోభాశెట్టిపై జనాలకి చిరాకేసింది. దాంతో నిన్నటి ఎపిసోడ్ లో శోభాశెట్టి ఎలిమినేట్ అయింది. ఇక శోభాశెట్టి హౌస్ లో పద్నాలుగు వారాలు ఉంది. శోభాశెట్టి రెమ్యునరేషన్ రోజుకి 35 వేలు చొప్పున వారానికి 2 లక్షల 50 వేల వరకు తీసుకుందంట‌. ఇక హౌస్ లో ఉన్న పద్నాలుగు వారాలకి గాను 30 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో మోనిత శకం ముగిసింది.


Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.