English | Telugu
రతిక చేతిలో ప్రశాంత్ చేయి.. శివాజీ పెద్దరికం!
Updated : Oct 28, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో రోజు రోజుకి ట్విస్ట్ లు పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా రతికకి పల్లవి ప్రశాంత్ దూరంగా ఉంటూ టాస్క్ లు బాగా ఆడుతూ టాప్-5 రేస్ లో దూసుకెళ్తున్నాడు. అయితే రతిక రీఎంట్రీ తర్వాత మళ్లీ కొత్త కథ మొదలైంది.
రతిక వచ్చీ రాగానే శివాజీ కాళ్ళ మీద పడి మారిపోయానని చెప్పింది. ఇక హౌస్ లోకి వచ్చాక రెండు, మూడు రోజుల దాకా డీసెంట్ గా ఉంది. ఇక మూడవ రోజు నుండి యావర్ తో మంతనాలు మొదలుపెట్టింది. అన్నీ లేనిపోనివి చెప్పి యావర్ ని తనకే సపోర్ట్ చేసేలా గ్రిప్ లో పెట్టుకున్న రతిక.. మరో సపోర్ట్ కోసం కోసం ప్రశాంత్ ని అక్క అని వద్దని, రతిక అని పిలవమని గత రోజంతా విసిగించింది. తనెంత విసిగించిన పల్లవి ప్రశాంత్ అస్సలు వినలేదు. అక్క అనే పిలుస్తానని అన్నాడు. అయితే యావర్ మధ్యలోకొచ్చి ఏం అయింది ఎందుకంత బాధ అని ప్రశాంత్ ని అడుగగా.. "నన్నేమైనా పడుతా కానీ మా అమ్మనాన్నలని అన్నది" అని ఏడ్చేశాడు. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అలా మాట్లాడాను దానికి సారీ అంటూ రతిక చెప్పింది. అయిన పల్లవి ప్రశాంత్ మారలేదు. ఇక రతిక కూడా కంటతడిపెట్టుకుంది.
కాసేపటికి శివాజీ రాగా.. రతిక బోరున ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. వాడు నాకు దేవుడిచ్చిన చైల్డ్. వచ్చిన మొదట్లో వాడు ఏడుస్తుంటే అందరిలా నటన అని అనుకునేవాడిని. కానీ వాడు జెన్యున్ ఎందుకంటే నేను దగ్గరనుండి చూశా చాలా మంచోడు. నువ్వు అలా అనేసరికి తట్టుకోలేకపోయాడు. నీ ఆట నువ్వు ఆడు అని చెప్పానని రతికతో శివాజీ అన్నాడు. ఇక హౌస్ లో అందరం ఫ్రెండ్స్ లానే ఉందామని పల్లవి ప్రశాంత్ కి శివాజీ చెప్పాడు. చేతిలో చేయి కలుపు అని ప్రశాంత్ తో శివాజీ అనగానే.. సరే అని రతిక చేతిలో చేయి వేసి ఇకనుండి ఫ్రెండ్స్ అని అన్నాడు. ఇక రతిక ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక నుండి ఆట ఎలా ఉండబోతుందో చూడాలి మరి.