English | Telugu
సంచాలకుడిగా శివాజీ తోపు.. సీరియల్ బ్యాచ్ ఆటకట్టించాడుగా!
Updated : Oct 20, 2023
కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ అందరిని కలిపి బిగ్ బాస్ హౌస్ మేట్స్ గా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం జిలేబిపురం వర్సెస్ గులాబీపురం టీమ్ ల మధ్య టాస్క్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఎవరు ఫౌల్(తప్పు) గేమ్ ఆడారు? ఎవరు కరెక్ట్ గేమ్ ఆడారో ఒకసారి చూసేద్దాం.
గ్రహాంతర వాసులని సంతోషపరిచాడనికి వారికి ఫ్యూయల్ కావాలని అది స్విమ్మింగ్ పూల్ లో ఉందని, దానిని తీసుకురావాలని చెప్పగా ఆట సందీప్ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా, ప్రియాంక జైన్ బయట ఉన్న ఒక్కో తాళం చెవిని ఇస్తుంది. అయితే ఈ ఆటలో ఇద్దరు కలిసి స్ట్రాటజీనీ ప్లే చేశారు. అదేంటంటే మొదటగా సందీప్ మాస్టర్ కి ప్రియాంక జైన్ తాళం చెవి ఇవ్వగా అది వస్తుందని చెప్పి, తన ప్యాంట్ లో దాచుకున్నాడు. ఇక సంచాలకుడిగా వ్యవహరిస్తున్న శివాజీ అది చూసేశాడు. ఒకసారి తీసుకెళ్ళిన తాళం చెవిని మళ్ళీ తిరిగి ఇస్తేనే మరో తాళం చెవి తీసుకెళ్ళాలని షరతుని ఉంచాడు. దాంతో వాళ్ళ పాచిక పారలేదు. వెంటనే ఆ కీని తిరిగి ప్రియాంకకి ఇచ్చేశాడు సందీప్. ప్రతీ టాస్క్ లో ఫౌల్ ఆడుతూ దానిని స్ట్రాటజీ అని చెప్పుకునే సీరియల్ బ్యాచ్ కి శివాజీ సంచాలకులుగా ఉంటేనే బుద్ధి వస్తుందని మరోసారి ఋజువు చేశాడు.
ఇక ఆ తర్వాత ఈ టాపిక్ ని టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, యావర్ లతో శివాజీ డిస్కస్ చేశాడు. ఆట ముగిసాక అమర్ దీప్, ప్రియాంక జైన్, ఆట సందీప్ కలిసి మాట్లాడుకుంటున్నారు. "స్విమ్మింగ్ పూల్ లో నాకు కోపం వచ్చి వాడి బనియన్ పట్టుకున్నాను. అమర్ ప్లేస్ లో ఎవరున్నా గట్టిగా గొడవ అయ్యేది" అంటూ అమర్ , ప్రియాంకలతో ఆట సందీప్ అన్నాడు. హౌస్ లో మొదటి నుండి అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, టేస్టీ తేజ, ఆట సందీప్ అందరు కలిసి గ్రూప్ గా గేమ్ ఆడుతున్న విషయం తెలిసిందే. అదే ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయింది. అయితే వీరికి శివాజీ సంచాలకుడిగా ఉంటేనే కరెక్ట్ అని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు.