English | Telugu
మరో బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి
Updated : Apr 24, 2024
సినీ సెలబ్రిటీస్ కి మాత్రమే కాదు బుల్లితెర సెలబ్రిటీస్ కూడా ఫాన్స్ ఉంటారు. ఈ సెలబ్రిటీస్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ తో కూడా చాలా విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో బుల్లితెర ప్రముఖ నటి మహేశ్వరి కూడా ఒకరు. ఈమె తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి బాగా తెలుసు. ఈమె డైరెక్టర్ శివనాగును లవ్ మ్యారేజ్ చేసుకుంది. అప్పటి నుంచి మహిషివన్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ రన్ చేస్తోంది. వీరికి ఆల్రెడీ హరిణీ అనే కూతురు కూడా ఉంది.
ఇక ఇప్పుడు ఆమె రెండో బిడ్డకు కూడా తల్లయ్యింది. ఐతే పాపా..బాబా అనే విషయాన్ని చెప్పలేదు. అందరి చేతుల మీదగా ఆ చిన్నారి చేతిని ఫోటో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అందరూ వాళ్లకు విషెస్ చెప్తున్నారు. ఐతే అందరూ కూడా అబ్బాయా, అమ్మాయా అని అడుగుతున్నారు. మహి మాత్రం నాలుగు ఎమోజిస్ పోస్ట్ చేసింది. ఆ ఎమోజి పెట్టాను కదా గెస్ చేయండి అని చెప్పింది. ఆ ఫోర్ ఎమోజిస్ ని గూగుల్ లో సెర్చ్ చేస్తే అబ్బాయి అని వచ్చింది. దాంతో నెటిజన్స్ కూడా బేబీ బాయ్ అంటూ గెస్ చేసి ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇక మహేశ్వరి విషయానికొస్తే.. ఈమె వదినమ్మ, శశిరేఖా పరిణయం సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వీళ్ళు ఇస్మార్ట్ జోడీ, ఫ్యామిలీ నంబర్ 1 షోల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. మహేశ్వరి యూట్యూబ్ ఛానెల్ లో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన కూతురు చేసే అల్లరి వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మహేశ్వరి తన ప్రెగ్నెన్సీ డైట్ ని కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకునేది.