English | Telugu
సుధీర్కు జంటగా సినిమా చేయాలని ఉంది!
Updated : May 1, 2021
బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్.. పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా గడుపుతోంది. అయితే చాలా ఏళ్లుగా రష్మీకి, సుడిగాలి సుధీర్ కి లింక్ చేస్తూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వీరి పెళ్లి వార్తలపై ఈ జంట స్పందిస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ పెళ్లి విషయంపై రష్మీ స్పందించింది. ఈ ప్రశ్న తనకు కొత్తది కాదని.. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం కెరీర్ మీదే దృష్టి పెడుతున్నట్లు.. పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. చాలా విషయాల గురించి 2020 లో ప్లాన్ చేసుకుంటే ఏం జరిగిందో అందరికీ తెలుసనీ.. 2021లో కూడా ఎలాంటి ప్లాన్స్ చేయదలచుకోలేదని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి గురించి ఆలోచన కూడా రావడం లేదని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. చాలా కాలంగా సుధీర్, రష్మీల జంటను వెండితెరపై చూడాలని ఆశపడుతున్నారు ప్రేక్షకులు. ఈ విషయంపై మాట్లాడిన రష్మీ.. ప్రస్తుతం సరైన కథల కోసం వెతుకుతున్నట్లు చెప్పింది.
సుధీర్ తో తన కాంబినేషన్ కు మంచి పాపులారిటీ ఉందని.. ఈ కాంబినేషన్ ను వెండితెరపై చూపించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. సుధీర్ తో కలిసి నటించాలని తనకు కూడా ఉందని.. ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ప్రస్తుతం రష్మీ నటించిన 'బొమ్మ బ్లాక్బస్టర్' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తారా..? లేక ఓటీటీలో రిలీజ్ చేస్తారా..? అనే విషయంలో క్లారిటీ లేదని రష్మీ వెల్లడించింది.
