English | Telugu

బుల్లితెర‌పై హీరో త‌ల్లిగా రాశి!

వెండితెర‌పై క‌థానాయిక‌లుగా ఆక‌ట్టుకున్న వారితో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా వ‌ర‌కు బుల్లితెర‌ని ఆశ్ర‌యిస్తున్నారు. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర‌ని న‌మ్ముకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఒక‌నాటి హీరోయిన్ రాశి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాజా ర‌వీంద్ర చేరుతున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మా కోసం 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' అనే పేరుతో రూపొందిన డైలీ సీరియ‌ల్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

ఇందులో 'సిరిసిరి మువ్వ‌లు' ఫేమ్ వంశీ ఆలూర్‌, 'మౌన‌రాగం' ఫేమ్ అమ్ములు పాత్ర ధారి ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ధారి వంశీ ఆలూరుకి రాశీ త‌ల్లిగా న‌టిస్తుండ‌గా, రాజా ర‌వీంద్ర మ‌రో కీల‌క పాత్ర‌ధారి ప్రియాంక జైన్‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. రెండు క‌ల‌ల మ‌ధ్య రెండు జీవితాలు ఒకే గూటికి చేర‌బోతున్నాయా అంటూ రిలీజ్ చేసిన ఈ సీరియ‌ల్ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

"జాన‌కి ఎంత చ‌దివినా అంత‌కంటే ఎక్కువ చ‌దివిన వాడినే తీసుకొస్తాన‌"ని తండ్రి పాత్ర‌లో రాజా ర‌వీంద్ర చెబుతున్న డైలాగ్‌ల‌తో పాటు "మంచిది తెలివైంది అయితే ఫ‌ర‌వాలేదు. కానీ మావాడిక‌న్నా ఎక్కువ చ‌దివేసి పొగ‌రుగా వుంటే మాత్రం క‌ష్టం.. నా కోడ‌లు ఏడో ఎనిమిదో చ‌దివితే చాలు".. అని రాశి చెబుతున్న తీరు భిన్న మ‌న‌స్థ‌త్వాలు.. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల క‌థ‌గా 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' సీరియ‌ల్ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.