Read more!

English | Telugu

శివాజీ కాళ్ళు మొక్కిన ప్రశాంత్.. జై జైవాన్ జై కిసాన్!

బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి క్రేజ్ పొందుతుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌ కి అత్యధిక టీఆర్పీ వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్-7 లో మొదటి కెప్టెన్ ఎవరు అని తెలిసే రోజు.. అందుకే ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూసారు.

గత రెండు రోజులుగా సాగుతున్న 'చిట్టీ ఆయిరే' టాస్క్ ముగిసింది. ఇందులో మొదటగా అమర్ దీప్-ఆట సందీప్ కలిసి వెళ్ళారు. అక్కడ అమర్ దీప్ కి వచ్చిన లెటర్ చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆట సందీప్ వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందోనని, ఆమె గురించి తెలుసుకోవాలని ఉందని అమర్ దీప్ తో చెప్పుకోగానే అతను కరిగిపోతాడు. దాంతో అమర్ దీప్ తనకొచ్చి‌న లెటర్ ని మిషన్ లో వేస్తాడు. ఆ తర్వాత ఆట సందీప్ ఆ లెటర్ ని చదువుని ఏడ్చేస్తాడు. ఇదంతా మోస్ట్ ఎమోషనల్ గా సాగుతుంది. ఇక ఆట సందీప్-అమర్ దీప్ ల నుండి ఆట సందీప్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ముందుకెళ్ళాడు. అమర్ దీప్ ఓడిపోయాడు. ఇక ఆ తర్వాత శివాజీ-పల్లవి ప్రశాంత్ యాక్టివిటీ ఏరియాకి వచ్చారు. "నాకు నా భార్య లెటర్ రాసింది. కాఫీ ఇచ్చినందుకు థాంక్స్ బిగ్ బాస్. ఇది నా రెండో పెళ్ళాం" అని బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు శివాజీ.

నేను గెలిస్తే నీకే ఇచ్చేవాడిని. ఈ లెటర్ నువ్వే చదువు, ఎందుకంటే నీ వెంట నేనుంటా.. ఆడు, దున్నేయ్.. నా కొడుకుతో ఛాలెంజ్ చేసి వచ్చాను ఇక్కడికి సాక్రిఫైజ్ చేయట్లేదు‌. రాగానే నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకున్నావ్. నాకు ఎవరి సపోర్ట్ లేదన్నావ్‌. నీతో ఎవరు మాట్లాడట్లేదన్నావ్. నీ వెంట నేనుంటా, కెప్టెన్ అవ్వు. నువ్వు అవుతావ్‌. నా భార్య ఈ లెటర్ లో ఏం రాసిందో నాకు తెలుసు. నువ్వు కసిగా ఆడు, గెలువు, వేటాడు. కానీ నువ్వు నీ లైన్ దాటొద్దు" అని శివాజీ అన్నాడు. అన్న వద్దు అన్న లెటర్ వేయొద్దన్నా అని పల్లవి ప్రశాంత్ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయినా శివాజీ వినకుండా మిషన్ లో వేశేసాడు. అన్నని ఈ లెటర్ చదవాలని రిక్వెస్ట్ చేస్తున్న బిగ్ బాస్ అని పల్లవి ప్రశాంత్ ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. కానీ అతన్నే చదవమన్నాడు బిగ్ బాస్. ఆ లెటర్ లో ఏం ఉందంటే.. " బిడ్డ మేం ఇక్కడ బాగున్నాం, నువ్వు గేమ్ మంచిగ ఆడుతున్నావ్. నీ ఆట నువ్వు ఆడు. బయట‌ పల్లవి ప్రశాంత్ అమ్మనాన్న అని అందరు మమ్మల్ని గుర్తిస్తున్నారు. నాన్న పొద్దుగాల  పొలం కాడికి పోతుంటే నువ్వే కనపడ్డవంట. గుర్తొచ్చావ్. మంచిగ ఆడు. రైతుబిడ్డ అంటే తగ్గేదేలే.. జై జైవాన్ జై కిసాన్ " అని ఆ లెటర్ లో రాసి ఉంది. ఇక ఈ లెటర్ చదువుతూ ఏడ్చేశాడు ప్రశాంత్. కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీ రేస్ లో సత్తా చాటుతున్నాడు పల్లవి ప్రశాంత్. తనకోసం తన లెటర్‌ని త్యాగం చేసిన శివాజీ దగ్గరకు వెళ్ళి కాళ్ళు మొక్కబోతుంటే వద్దూ అంటూ ప్రశాంత్‌ని హగ్ చేసుకున్నాడు శివాజీ. ఈ ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.