English | Telugu
పల్లవి ప్రశాంత్ నెంబర్ కి మిస్ట్ కాల్ కలవట్లేదుగా..
Updated : Dec 10, 2023
బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రేస్లో ముందున్న పల్లవి ప్రశాంత్కి మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయడానికి 8886676905 అనే నెంబర్ని కేటాయించారు బిగ్ బాస్. అయితే ప్రశాంత్కి పడుతున్న ఓట్లలో సగానికి సగం ఓట్లు మిస్డ్ కాల్ ద్వారానే. ఎందుకంటే రైతు బిడ్డను సపోర్ట్ చేస్తూ చాలా గ్రామాల నుంచి రైతులు, సామాన్యులు అధిక సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు. అందులో హాట్ స్టార్ లో ఓట్ వేసేవారి కంటే ఎక్కువమంది మిస్డ్ కాల్ ద్వారానే ఓట్లేస్తున్నారు.
ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. శోభాశెట్టి ఈ వారం ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ నడుస్తుంది. అయితే మిగిలిన ఆరుగురిలో ప్రస్తుతం ఓటింగ్ లో.. మొదటి స్థానంలో శివాజీ, రెండవ స్థానంలో పల్లవి ప్రశాంత్ కొనసాగుతున్నారు. అయితే వీరి తర్వాత అమర్ దీప్ ఉండగా.. చాలా ఓట్ల తేడాతో మూడవ స్థానంలో ఉన్నాడు. ప్రశాంత్ కి ఓవరాల్ గా వంద శాతం ఓటింగ్ పడితే, అమర్ దీప్ కి ఇరవై శాతం కన్నా తక్కువ ఓటింగ్ పడుతుంది. దీంతో అమర్ దీప్ ని విజేతని చెయ్యాలనేమో కానీ ప్రశాంత్ కి ఓట్ వేయడానికి ఇచ్చిన నెంబర్ ని బ్లాక్ లో పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇలా చేయడం వెనుక ఒకటే రీజన్ ఉంది అదేంటంటే.. ప్రస్తుతం జరుగుతున్న మిస్డ్ కాల్ ఓటింగ్ తో అత్యధిక ఓటింగ్ ప్రశాంత్ కి లభిస్తుంది. కాగా ఈ నెంబర్ బ్లాక్ లో పెడితే.. అమర్ దీప్ కి ఓటింగ్ శాతం పెరిగి అతను రెండవ స్థానంలోకి వెళ్తాడు. దీంతో శీవాజీని ఎలాగైనా తప్పించి అమర్ దీప్ కి పట్టం కట్టడానికే ఇలా చేస్తున్నారా అంటూ.. ప్రశాంత్ కు ఓట్లు వేయాలనుకున్న వారు కామెంట్ చేస్తున్నారు.
ప్రశాంత్ నెంబర్ తప్ప అందరి నెంబర్లు రింగ్ అవుతున్నాయి.. ఓట్లు పడుతున్నాయి. కానీ ప్రశాంత్ నెంబర్ మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా.. హోల్ట్లోనే ఉన్నట్టుగా సౌండ్ వస్తుంది. దీంతో ప్రశాంత్కి ఓట్లు పడకుండా కావాలనే బిగ్ బాస్ ఇలా చేస్తున్నారని.. అతని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో గ్రామాల నుండి ప్రశాంత్ కి ఓట్లు వేస్తున్నారనేది నిజం. ఎందుకంటే సిటిలోని వారే హాట్ స్టార్ ఆప్ లో ఓట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే హౌస్ లోని ఎవరి నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే కలుస్తుంది. ప్రశాంత్ నెంబర్ 8886676905 కి ఎన్నిసార్లు చేసిన బిజీ వస్తోంది. మరి ఇలా ఎందుకు వస్తుందని పల్లవి ప్రశాంత్ అభిమానులు తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు.