English | Telugu

‘పాడుతా తీయగా’ విన్నర్ మాస్టర్ సార్థక్... డబుల్ ఫ్రైజ్ మనీ


ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ లోకి ఉత్తమమైన కార్యక్రమంగా "పాడుతా తీయగా" అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు సీజన్ 20 గ్రాండ్ ఫినాలే పూర్తయ్యింది. ప్రతీ వారం పోటాపోటీగా చిన్నారి కంటెస్టెంట్స్ పాడేవారు. ఇక ఈ సిరీస్ 20 టైటిల్ విన్నర్ గా సార్థక్, ఇక సెకండ్ ప్లేస్ విన్నర్ గా కీర్తన, ఇక థర్డ్ ప్లేస్ విన్నర్ ఆశ్రిత్ రాఘవ నిలిచారు. ఇక వీళ్లకు బహుమతులు అందించారు క్రేన్ వక్కపొడి-దుర్గ డెయిరీ సంస్థల అధినేత గ్రంధి కాంతారావు.

ఇక ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రైజ్ అమౌంట్ ని డబుల్ చేస్తున్నట్టుగా ఆయన స్టేజి మీద ప్రకటించేసరికి ఆడియన్స్ ఈలలతో స్టేజి దద్దరిల్లిపోయింది. 1st ప్రైజ్ విన్నర్ కి 10 లక్షలు, 2nd ప్రైజ్ విన్నర్ కి 6 లక్షలు, 3rd ప్రైజ్ విన్నర్ కి 4 లక్షలు అనౌన్స్ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ " మీ నాన్నగారు బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రాన్ని నిర్వహించేవారు. తర్వాత మీరెలా చేస్తారో అని అందరూ అనుకున్నారు..కానీ మీరు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. వీళ్ళు పిల్లలు కాదు..ఎంతో అద్భుతంగా పాడారు. నెక్స్ట్ సీజన్ కి కూడా మేమే స్పాన్సర్ చేస్తున్నాం " అని చెప్పారు. ఇక ఫైనల్ గా విన్నర్స్ కి ట్రోఫీస్, సర్టిఫికెట్స్, చెక్స్ ఇచ్చి ఈ సీజన్ ని ఎండ్ చేశారు ఎస్పీ చరణ్.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.