English | Telugu

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది.

మేడమ్ లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి అని ఆవిడ అనగానే అప్పు కాదనలేక వెళ్తుంది. లోపల రేణుక భర్తతో ఆవిడ ఉన్న ఫోటో చూసి అప్పు షాక్ అవుతుంది. అతను ఎవరని అప్పు అడుగగా నా భర్త అని చెప్తుంది. పెళ్ళి జరిగి ఎన్ని నెలలు అవుతుందని అప్పు అడుగగా ఆరు నెలలవుతుంది. నా మొదట భర్త చనిపోయాడు‌ నన్ను నా పాపని బాగా చూసుకుంటాడని మళ్ళీ తనని పెళ్లి చేసుకున్నానని ఆవిడ చెప్పగానే అంటే భర్త లేని వాళ్లని టార్గెట్ చేసి పిల్లలను ఏం చేస్తున్నాడని అప్పుకి డౌట్ వచ్చి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ రేణుక భర్తని స్టేషన్ కి తీసుకొని రండి అని వెళ్ళిపోతుంది. మరొకవైపు చేసిన యాడ్ షూట్ వస్తుంది. అది ప్లే చేసుకొని అందరు చూస్తారు. యాడ్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంట్రా యాడ్ ఫెయిల్ అవుతుందన్నావ్.. మరి ఇదేంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రేణుక భర్త అశోక్ ని ఇంటరాగేషన్ చేస్తుంది. అశోక్ భయపడి నిజం చెప్తాడు. నేను చిన్న పిల్లలని వేరే వాళ్ళకి అమ్మేస్తాను.. వాళ్ళ ఆర్గాన్స్ తీసుకుంటారు.. అందుకే రేణుక కూతురిని కిడ్నాప్ చేసాను.. ఆపరేషన్ కి టైమ్ పడుతుందంటే నా దగ్గర దాచానని అశోక్ చెప్పగానే అప్పు అతన్ని కొడుతుంది. ఆ తర్వాత రేణుక వస్తుంది. తనకి వాళ్ళ పాపని అప్పగిస్తుంది.

మీడియా వాళ్ళు వస్తారు. నా పాప దొరికిందంటే కారణం అపూర్వ మేడమ్ అని రేణుక చెప్తుంది. అది న్యూస్ లో రావడం రుద్రాణి చూసి ఇంట్లో వాళ్ళకి చూపిస్తుంది. అప్పుడే అప్పు,కళ్యాణ్ ఎంట్రీ ఇస్తారు. నన్ను ఇంత మోసం చేస్తారా.. ఇక అప్పు ఉద్యోగం చెయ్యడానికి వీలు లేదని ధాన్యలక్ష్మి తెగేసి చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్, కావ్య కలిసి ధాన్యలక్ష్మికి అప్పుపై ఉన్న కోపాన్ని పోగొట్టేలా చెయ్యాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.