English | Telugu

జూన్ 13 నుంచి న్యూ సీరియల్ 'కోడళ్ళు మీకు జోహార్లు'

జీ తెలుగులో ప్రసారం కాబోయే కొత్త సీరియల్ "కోడళ్ళు మీకు జోహార్లు " టైమింగ్, లాంచింగ్ డేట్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3.30 గంటలకు రాబోతోంది. దీపావళి కొందరిని విడదీసింది.. కొందరిని కలిపింది. ఐతే అందర్నీ విడదీసిన దీపావళి 14 ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుతుందా.. సంతోషాన్ని పంచుతుందా చూడాల్సిందే అనే సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

హీరోగా నాగార్జున యాక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు 'కస్తూరి' సీరియల్ లో పరం అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ సీరియల్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్స్ గా దుర్గశ్రీ, కౌస్తుభ మణి నటిస్తున్నారు. దుర్గశ్రీ ఇది వరకు ఉదయ టీవీలో ప్రసారమైన 'నేత్రావతి' అనే సీరియల్ లో నటించారు. ఇక కౌస్తుభ మణి కలర్స్ కన్నడలో 'నన్నరాసి రాధే' అనే సీరియల్ లో ఇంచరా అనే పాత్రలో యాక్ట్ చేశారు.

ఈ సీరియల్ లో ఇంకా చరణ్ రాజ్ ఒక పాత్రలో కనిపించనున్నాడు. అతను 'వదినమ్మ' సీరియల్ లో భరత్ అనే పాత్రలో యాక్ట్ చేశారు. 'నిన్నే పెళ్ళాడతా', 'స్వర్ణ పేలెస్' అనే సీరియల్స్ లో నటించిన జయరాం పవిత్ర ఈ సీరియల్ లో అత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సీరియల్ లో మెయిన్ గా ఆనాటి అందాల నటి రాగిణి తల్లి కేరెక్టర్ లో కనిపించనున్నారు. ఈమె గురుంచి చెప్పాలంటే ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రేమ్ సాగర్ ఒక రోల్ లో నాగార్జునకు తల్లి పాత్రలో జానకి వర్మనటిస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.