English | Telugu

ఇవ్వాళ రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే...


ఆలీతో సరదాగా సీజన్ 2 ప్రతీ వారం ఎంటర్టైనింగ్ గా సాగిపోతోంది. ఈ వారం షోకి సీనియర్ నటుడు మురళి మోహన్ ని అలాగే కోడలు మాగంటి రూపాను తీసుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తైన సందర్భంగా మురళి మోహన్ కి కంగ్రాట్స్ చెప్పారు ఆలీ. శంకరాభరణం సినిమాను 100 సార్లు చూసాను అని మాగంటి రూపా చెప్పేసరికి అదా విషయం ఏమిటా ఈ మూవీకి ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయా అనుకున్నాను అంటూ ఆలీ సెటైర్ వేశారు.

ఇక తాను బురదలో ఆడుకుంటున్నప్పుడు చూసిన తన అత్తగారు కోడల్ని చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నారట అలాగే ఈ అమ్మాయి చాలా ఎఫిషియెంట్ గా ఉంది మన కోడలైతే ఎంత బాగుంటుంది అని మురళి మోహన్ కూడా అనుకున్నారట అలా రూపాను ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాం అని చెప్పారు. తాను చిన్నప్పుడే పొలిటిషన్ అవుతానని ఇంట్లో చెప్పేవారట రూపా. తన సెకండ్ సిస్టర్ మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నారట..థర్డ్ సిస్టర్ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటానని చెప్పారట. ఇక ఆలీ ఒక ప్లేట్ లో టమాటో, నిమ్మకాయ చూపించి ఈ రోజు నుంచి ఇవి తినడం మానేయాలి అనేసరికి తినొద్దంటే ఎట్లా కానీ ఆలీకి ఇచ్చిన మాట కాబట్టి పర్లేదులే అని చెప్పారు మురళి మోహన్. ఐతే ఈరోజున రాజకీయాలు సరిగా లేవనే విషయాన్నీ రూప ప్రోమో చివరిలో చెప్పారు. మరి ఇంతకు ఆమె ఎలాంటి విషయాలు చెప్పారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఆయన నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, రియల్టర్ గా గుర్తింపు తెచ్చకున్నారు. ఆయన 350కి పైగా సినిమాల్లో నటించారు. ఇక మురళీ మోహన్ జయభేరి సంస్థ ద్వారా 20 సినిమాలు నిర్మించారు. 1978లో ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.