English | Telugu

మెగా ఫామిలీకి, చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ కి ఆర్పీ చేపల పులుసు

జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఐతే అక్కడ వచ్చిన కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఆర్పీ ఎప్పుడో ఈ షో నుంచి బయటికి వచ్చి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ప్రారంభించారు ఇక ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయ్యింది కూడా. హైదరాబాదులో ఒక బ్రాంచ్ ప్రారంభించిన ఈయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు.

ఐతే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తన రెస్టారెంట్ లోని చేపల పులుసును సెలబ్రిటీలకు కూడా పంపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. "ఆర్పీ పట్నాయక్ గారికి పంపించాను, చంద్రబోస్ గారికి టు టైమ్స్ పంపించాను, రాంచరణ్-ఉపాసన గారికి, చైరంజీవి గారికి కూడా నా చేపల పులుసు వెళ్ళింది. సెలబ్రిటీస్ కి పంపిస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకా ఎంతో శ్రద్ద పెట్టి చేయాలి. ఫీడ్ బ్యాక్ అనవసరం ఎందుకంటే మనం ఎం చేసినా కరెక్ట్ గా చేయాలి అంతే..అందుకే పసుపు కొమ్ములు తెప్పించి ఆడించి, గుంటూరు నుంచి మిర్చి తెప్పించి అంతా పక్కాగా చేస్తున్నాం...ఫీడ్ బ్యాక్ కోసమే నేను చేపల పులుసు పంపను..చేపల పులుసు టేస్ట్ నచ్చి మరోసారి నాకు కాల్ చేయాలనే ఉద్దేశంతోనే సెలబ్రిటీలకు పంపిస్తున్నాను. చేపల పులుసు తయారీ విషయంలో ఎక్కడా పడే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి మణికొండ బ్రాంచ్ కూడా వర్క్ జరుగుతోంది. మా దగ్గర ఉండే లేడీ సీనియర్ షెఫ్స్ ఏదైతే సలహాలు, సూచనలు ఇస్తారో వాటిని ఫాలో ఐతే మాత్రం బిజినెస్ లో మనకు తిరుగే ఉండదు. ఒక పది రూపాయలు పోయినా మంచి రుచికరమైన వంట చేసి అందిస్తే కస్టమర్లు ఎవరూ మన దగ్గర నుంచి తిరిగి వెళ్ళరు" అంటూ కిర్రాక్ ఆర్పీ ఎన్నో విషయాలు చెప్పాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.