English | Telugu

కౌశ‌ల్ భార్య‌కు కొవిడ్ నెగ‌టివ్‌! ఇండియాకు తిరిగొచ్చేసింది!!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు కౌశల్. అప్పటివరకు సీరియల్స్ లో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన కౌశల్ కి బిగ్ బాస్ షో ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. షో నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచాడు కౌశల్. అదే సమయంలో కౌశల్ భార్యపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల కౌశల్ తన భార్య నీలిమ ఆరోగ్యం గురించి చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నీలిమ స్వయంగా ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసింది. ఉద్యోగ రీత్యా యూకేలో ఉంటున్నానని.. ఆ సమయంలో కోవిడ్ బారిన పడినట్లు నీలిమ వెల్లడించింది. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. తనకు సరైన వైద్యం కూడా చేయడం లేదంటూ వాపోయింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకున్నారు.

తాజాగా నీలిమ కరోనా నుండి బయటపడింది. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగెటివ్ రావడంతో వెంటనే ఇండియాకు చేరుకుంది. ఈ విషయాన్ని కౌశల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్ నుండి తనకు సర్టిఫికేట్ రావడంతో నీలిమ ఇండియాకు చేరుకుందని కౌశల్ తెలిపాడు. తన ఆరోగ్యం గురించి ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి నీలిమ కృతజ్ఞతలు చెప్పింది. చాలా రోజుల త‌ర్వాత త‌న పిల్ల‌ల‌ను క‌లుసుకున్నానంటూ వాళ్ల‌తో క‌లిసి ఆడుతున్న వీడియోల‌ను షేర్ చేసింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.