English | Telugu

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి తోసేస్తాం!

బుల్లితెర మీద హైపర్ ఆది కంటే అతను వేసే పంచులు ఫుల్ ఫేమస్ అవుతాయి. అలాంటి ఆది రీసెంట్ గా ఒక షోలో తన గురించి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. "పాలిటిక్స్ అన్నప్పుడే ఇలాంటివి ఉంటాయి. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను ఇవతల పక్క పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మాట్లాడినందుకు ఒక 10 మంది సీనియర్స్ నన్ను పైకి తీసుకెళ్లి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే బిల్డింగ్ పై నుంచి తోసేస్తాం అన్నారు. కానీ ఇప్పటికీ ఆ సప్లిమెంట్స్ రాసుకుంటూ ఆ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతున్నారు కానీ నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసా. ఆ రోజుల్లో ఇలాంటి బెదిరింపులు చాలా ఉండేవి. ఆ తరవాత నా మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఫేక్ పోస్టులు పెట్టడం వంటివి అప్పట్లోనే స్టార్ట్ చేశారు కానీ ఈరోజు కూడా నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాను. నేను ఓన్లీ ఈ షోస్ మాత్రమే కాదు ప్యారలల్ గా పాలిటిక్స్ లో కూడా ఉంటున్నాను కదా అందుకే కొంతమంది నా మీద ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను వచ్చాక ఎన్ని మంచి షోస్ చేసాను ఎంత రేటింగ్ వచ్చింది అనేది మల్లెమాల వాళ్లకు, ఈటీవీ వాళ్లకు తెలుసు అందుకే నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను.

నా వ్యూయర్ షిప్ చెప్తుంది నేనేంటి అనేది. బాడీ షేమింగ్ అంటారు కానీ కోట శ్రీనివాస్ రావు గారు కొన్ని సినిమాల్లో బాబు మోహన్ గారిని ముళ్ళపంది, నల్లపెంకు అంటారు. అది వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్. ఆ కామెడీ అప్పుడు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ కూడా మేమంతా ఎవరి మీద ఎవరు కామెడీ చేయాలనుకున్నా అది ముందే వాళ్లకు చెప్పి అంతా ఓకే అనుకున్నాకే టెలికాస్ట్ వరకు వస్తుంది. ఇంత పద్దతిగా మాట్లాడేవాళ్ళు షిర్డీ సాయి బాబా సినిమాకు ఒక 100 కోట్ల కలెక్షన్ తీసుకురావచ్చు కదా అలాంటి సినిమాలకు ఎవరూ వెళ్ళరు. ఒక స్కిట్ లో అన్ని ఉంటాయి. సోషల్ మీడియా గురించి అస్సలు పట్టించుకోను. పాలిటిక్స్ లో నాకు నచ్చిన నాయకుడికి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేస్తాను" అని చెప్పాడు ఆది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.