Read more!

English | Telugu

Karthika Deepam2 : బంటుగాడు జస్ట్ మిస్.. తన గురించి దీప నిజం తెలుసుకోగలదా?

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో.. నర్సింహని దీప తీసుకొని వస్తానంటూ వెళ్ళిందని ఇంకా రాలేదని అనసూయ అంటుంది.. ఇంటిని వేళం వెయ్యాలని ఊరి పెద్దమనిషి అనగానే.. లేదు నేను వెళ్లి వాళ్ళని తీసుకొని వస్తానంటూ అనసూయ అంటుంది. నమ్మకం లేదు నువ్వు వారంలో రాకపోతే నీ ఇంటికి వేలం వేస్తామని మల్లేష్ చెప్తాడు. అందుకు ఒప్పుకుంటు అనసూయ సంతకం చేస్తుంది.

ఆ తర్వాత అందరు గుడికి వస్తారు. అక్కడ జ్యోత్స్న పేరు మీద, దీప పేరు మీద సుమిత్ర అర్చన చేయిస్తుంది. దీపని ఏదో రకంగా తక్కువ చేసి మాట్లాడడానికి పారిజాతం ట్రై చేస్తుంటే.. తనపై దీప కోప్పడుతుంది. ఆ తర్వాత శౌర్యకి గుడిలో గంట అందకపోతే.. చీటికె వేస్తే గంట అందుతుందని శౌర్యా అంటుంది కార్తీక్ అని శౌర్య అనగానే.. శౌర్యని కార్తిక్ ఎత్తుకొని గంట కొట్టిస్తాడు.. ఆ తర్వాత బంటు, ఇంకా సుమిత్రపై ఎటాక్ చేసినవాడు మాట్లాడుకోవడం దీప చూసి.. వెంటనే సుమిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తుంది. వెంటనే అందరు కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడే ఆ రౌడీ బంటుతో మాట్లాడి వెళ్ళిపోతాడు. బంటు కాలర్ పట్టుకొని.. ఇందాక మాట్లాడినవాడు ఎక్కడ అని కార్తిక్ అడుగుతాడు. వెళ్ళిపోయాడని బంటు చెప్తాడు. వాడు ఎవడు? వాడితో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావని కార్తీక్ అడుగుతుంటే.. ఎక్కడ నిజం చెప్తాడో అని పారిజాతం భయపడుతుంది. వాడి సంగతి నేను చెప్తానంటూ కార్తీక్ ని పక్కకి వెళ్ళమని.. చెప్పారా అంటు బంటుని కొడుతుంది పారిజాతం. ఒకవైపు నిజం చెప్పొద్దంటూ రిక్వెస్ట్ చేస్తుంది.

ఆ తర్వాత వాళ్ళెవరో నాకు తెలియదు అడ్రెస్ కావాలంటే చెప్పానని బంటు చెప్తాడు. ఆ రౌడీ మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక బంటుని పారిజాతం తిడుతుంటుంది. మరొకవైపు జ్యోత్స్న బర్త్ డే కి స్పెషల్ ఐటమ్స్ అన్నీ దీప రెడీ చేస్తుంది. తనకి హెల్ప్ చేస్తూ తన గురించి తెలుసుకోవాలని సుమిత్ర అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.