English | Telugu

Krishna Mukunda Murari : వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలి.. లేదంటే ప్రమాదమే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -451 లో.. కడుపునొప్పితో ఉన్న కృష్ణను అందరు కలిసి ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. అయితే కృష్ణకు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్ పరిమిళ.. మురారీని తన క్యాబిన్‌కి రమ్మంటుంది. మురారి వెనుకే మీరా కూడా వినడానికి వెళ్తుంది. అదేసమయంలో మధుకి రేవతి కాల్ చేసి.. ఏడుస్తుంది. దానికి ఎలా ఉందిరా? కృష్ణకి నొప్పి తగ్గిందా? డాక్టర్ ఏమన్నారంటు మధుని రేవతి అడుగుతుంది. ఏం కాదు పెద్దమ్మా.. డాక్టర్ చూస్తున్నారు. అంతా బాగైపోతుంది.. మీరు బాధపడి.. పెద్దపెద్దమ్మను హడావిడి చేయొద్దని మధు అంటాడు‌. దాంతో రేవతి ఏడవడం ఆపేసి ఫోన్ పెట్టేస్తుంది.

ఇక రేవతి భాదలో ఉంటే తన దగ్గరికి ఆదర్శ్ వచ్చి.‌. మీరాతో పెళ్ళికి అమ్మ ఒప్పుకుందా అని అడుగుతాడు. కృష్ణకేమవుతుందోననే భాదలో ఉన్న రేవతికి.. ఆదర్శ్ ప్రవర్తన చిరాకు తెప్పిస్తుంది. మీరాతో నీ పెళ్లి గురించి భవానీ అక్క ఆలోచిస్తానని చెప్పింది. ఆలోచించి నిర్ణయం చెబుతానని అంది. తను ఏదన్నది చెప్పాక.. నీకు మళ్లీ చెబుతానని ఆదర్శ్ పై రేవతి కోప్పడుతుంది. కృష్ణ కారణంగా నా ముకుంద ప్రాణాలే పోగొట్టుకుంది. అలాంటిది తన గురించి ఇంతగా ఆలోచిస్తున్నారేంటని ఆదర్శ్ మనసులో తిట్టుకుంటాడు. మరోవైపు మురారీకి డాక్టర్ పరిమిళ.. షాకింగ్ నిజం చెప్తుంది. కృష్ణకు గర్భసంచి తీసెయ్యాలి.. వారం రోజుల్లో తియ్యకపోతే ప్రమాదం. తనకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరంటూ డాక్టర్ చెప్పడంతో.. మురారీ అక్కడే కూలబడి ఏడుస్తుంటాడు. అది విని మీరా సంతోషిస్తుంది. ఇక కాసేపటికి కృష్ణ నొప్పి లేకుండా మామూలుగానే ఉండటంతో అందరు ఇంటికి తీసుకొస్తారు. అయితే తన గర్భసంచి దెబ్బతిన్న విషయం కృష్ణకు తెలియదు. ఇక కృష్ణను మురారి ఇంటికి తీసుకుని వెళ్తాడు. తన మనసులోని భాదని కృష్ణతో చెప్పకుండా.. మురారి ఒక్కడే తనలో తానే భాదపడుతుంటాడు.

ఇక ఇంటికొచ్చిన కృష్ణ తన అత్త రేవతితో మాట్లాడుతుంది. పిల్లల్ని కనడం గురించి, భవానీ కోరిక గురించి మాట్లాడుతుంది. అప్పుడే మీరా ఓ బాబు, పాప ఉన్న ఓ బొమ్మను తెచ్చి.. కృష్ణకు గిఫ్ట్‌గా ఇస్తుంది. త్వరలోనే నీకు పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నానని మీరా అంటుంది. మీరా క్రూరత్వం తెలియని కృష్ణ.. ఆ బొమ్మని చాలా ఎమోషనల్‌గా అందుకుని.. మురారీతో తనకు పుట్టబోయే బిడ్డల గురించి మురారీతో మాట్లాడుతుంది. ఇక అసలు నిజం తెలియక కృష్ణ అలా మాట్లాడుతుంటే.. మురారీ కన్నీరు మున్నీరవుతాడు. కంటనీటితో కృష్ణను జాలిగా చూస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.