English | Telugu

మోనిత‌కు టెన్ష‌న్‌.. అత్తా కోడ‌ళ్ల కామెడీ!

స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతోంది. సీరి‌య‌స్ ట‌ర్న్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ దీప‌, ఆమె అత్త సౌంద‌ర్య‌తో క‌లిసి కామెడీని పండించేస్తోంది. దీంతో మ‌హిళా ప్రేక్ష‌కుల్లో ఒకింత ఆనందం.. ఒకింత ఉత్కంఠ నెల‌కొంది. ఈ బుధ‌వారం ఎపిసోడ్ మ‌రింత ర‌స‌వ‌త్త‌ర మ‌లుపుల‌తో సాగ‌బోతోంది. డాక్ట‌ర్ బాబు అడుగులు మోనిత‌కు వ్య‌తిరేకంగా ప‌డుతున్న నేప‌థ్యంలో ఎపిసోడ్ కీల‌క మ‌లుపులు తిర‌గ‌బోతోంది.

అయితే సీరియ‌స్ గా సాగే ఈ ఎపిసోడ్‌లో అత్తా కోడ‌ళ్లు దీప, సౌంద‌ర్య కామెడీ హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. "రెండు రోజులు నీతో వుంటాను నాన్నా" అంటూ డాక్ట‌ర్ బాబుతో ఇంటికి వ‌చ్చేసిన శౌర్య చిన్న చిన్న‌గా త‌న‌ని మార్చ‌డం మొద‌లుపెడుతుంది. టిఫిన్ బండి వ‌ద్ద టిఫిన్ చేద్దామంటూ తీసుకెళ్లి కార్తీక్ తో టిఫిన్ తినిపించేస్తుంది. ముందు అయిష్టంగానే టిఫిన్ బండి ద‌గ్గ‌రికి వ‌చ్చినా కార్తీక్ ఆ త‌రువాత శౌర్య చెప్పిన మెనూ అద్భుతంగా వుండ‌టంతో లొట్ట‌లేస్తూ తింటుంటాడు. ఇంత‌లో అక్క‌డికి అత్త సౌంద‌ర్య‌ని తీసుకుని దీప స్కూటీపై వ‌స్తుంది.

అక్క‌డ కార్తీక్‌ని చూసి ముందు ముఖం చిట్లించుకున్నా శౌర్య‌తో క‌లిసి టిఫిన్ చేస్తుండ‌టం చూసి ఆనందిస్తుంది. దీప‌ మాత్రం ఈ చూడ‌ముచ్చ‌టైన దృశ్యం చూసి సంబ‌రంతో గాల్లో తేలిపోతోంది. ఇక గురువారం ఎపిసోడ్ మోనిత‌కు టెన్ష‌న్‌గా.. వుంటే దీప‌కు, సౌంద‌ర్య‌కు కామెడీగా వుంటుంది. మోనిత బండారాన్ని బ‌య‌ట‌పెట్టే ఆధారం కార్తీక్ చేతికి చిక్కుతుంది. కానీ దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి మోనిత‌కు మ‌రో ఆధారం ల‌భిస్తుంది. అదేంటీ? దాన్ని అడ్డు పెట్టుకుని కార్తీక్‌తో మోనిత ఆడిన నాట‌కం ఏంటీ అన్న‌ది రేప‌టి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.