English | Telugu

'కార్తీక దీపం'లో షాకుల మీద షాకులు!

బుల్లితెర ధారావాహిక 'కార్తీక దీపం' రోజుకో మ‌లుపు తిరుగుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఈ సోమ‌వారం 969వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు మోనిత ఏం చేయ‌బోతోంది.. దాని వ‌ల్ల దీప ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోబోతోంది.. కార్తీక్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు?.. అన్న‌దే ప్ర‌ధాన హైలైట్‌గా నిల‌వ‌బోతోంది. విహారికి పిల్ల‌లు పుట్ట‌ర‌ని డాక్ట‌ర్ ద్వారా తెలుసుకున్న తుల‌సి ఆ విష‌యాన్ని దీప‌కు చెబుతుంది.

ఇలాగైనా నీ కాపురం నిల‌బ‌డితే చాలని చెబుతుంది. "ఇప్పుడు కూడా ఈ అవ‌కాశాన్ని వాడుకోక‌పోతే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఈ అవ‌కాశం వృధా అవుతుంది. ఈ నిజం నీ కాపురాన్ని నిల‌బెడితే నాకు కావాల్సింది ఏముంది" అంటుంది తుల‌సి.. క‌ట్ చేస్తే .. కార్తీక్‌ని సౌంద‌ర్య "రేపే క‌దా కోర్టు?"` అన‌డుగుంది. "లేదు.. నేను కేసు విత్‌డ్రా చేసుకున్నాను" అంటాడు కార్తీక్‌.. "అదేంట్రా!" అంటూ షాక‌వుతుంది సౌంద‌ర్య‌. "నేను కోర్టుకు వెళ్ల‌నంటే ఆనందించాల్సింది పోయి అప్సెట్ అవుతావేంటి మ‌మ్మీ" అంటాడు.

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌ధ్య‌లో మోనిత ఎంట‌ర‌వుతుంది. తులసితో దీప మాట్లాడిన వీడియోను కార్తీక్‌కి, సౌంద‌ర్య‌కి చూపించి షాకిస్తుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? దీప‌ని కార్తీక్ ఏమైనా అన్నాడా?.. తీర్థ‌యాత్ర‌లు తిరిగి వ‌చ్చిన‌ 'అర్ధ‌పావు' భాగ్యం త‌న ఇంటికి వ‌చ్చిన కార్తీక్‌ని ఏమ‌డిగింది? .. దాంతో కార్తీక్ ఎందుకు షాక‌య్యాడు? .. సౌంద‌ర్య చెప్పిన విష‌యం విని దీప ఎందుకు షాక‌య్యింది?.. ఇంత‌కీ దీప‌కు సౌంద‌ర్య చెప్పిన షాకింగ్ విష‌యం ఏంటీ? అన్న‌ది నేటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.