English | Telugu

"హిమను చంపింది నేనే" అని చెప్పిన‌ మోనిత... అంజిని కూడా చంపిందా?

కార్తీక్‌ కోసం మోనిత ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పడానికి ఈ రోజు ఎపిసోడ్‌ ఉదాహరణగా నిలుస్తుంది. అలాగే, కార్తీక్‌ మీద మోజులో మోనిక ఎంత తప్పు చేయడానికైనా వెనుకాడదని, హత్యలు చేయడానికి ఓ క్షణం కూడా ఆలోచించదని ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇంతకీ, బుధవారం (ఆగస్టు 4, 2021) 1109 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

ఎయిట్‌ హోటల్‌లో ఉన్న అంజి కోసం వంటలక్క అలియాస్‌ దీప, మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే. మోనిత కారు ట్రబుల్‌ ఇవ్వడంతో లిఫ్ట్‌ అడిగి వంటలక్క కారు ఎక్కిన‌ విషయమూ విదితమే. ఫోనులో మోనిత మాట్లాడుతున్న మాటలను వెనుక కూర్చున్న వంటలక్క వింటూ ఉంటుంది. అయితే, వాటర్‌ బాటిల్‌ కనిపించడం లేదని వెంకటేశ్‌ను లైట్‌ వేయమని మోనిత అడుగుతుంది. లైట్‌ వేశాక... వెనుక సీట్‌లో ఉన్న వంటలక్కను చూస్తుంది. షాక్‌ అవుతుంది.

అంజి కోసం వెళ్తున్నట్టు ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకోరు. మోనితకు వంటలక్క ‘విజయవాడ దుర్గ గుడికి’ అని చెబితే... వంటలక్కకు మోనిత ‘ఎయిట్‌ హోటల్‌లో వంటవాళ్లు బాగా చేస్తారని విన్నా. రేపు జరగబోయే నా పెళ్లికి తీసుకువెళదామని’ అని అబద్దాలు ఆడతారు. మోనితను హోటల్‌ దగ్గర దింపిన వంటలక్క విజయవాడ వెళ్తున్నట్టు నటిస్తుంది. మళ్లీ వెనక్కి తిరిగి వస్తుంది.

హోటల్‌లో ఉన్న అంజిని మోనిత పట్టుకుంటుంది. గన్‌ గురిపెడుతుంది. ‘మారిపోయానమ్మా’ అని అంజి కాళ్ల మీద పడి బతిమాలతాడు. అయినా అతడిని మోనిత వదలదు. ‘నేను కార్తీక్‌ను ఎలా వదిలేస్తాననుకున్నావ్‌? దీపమ్మా దీపమ్మా అంటుంటావ్‌ కదా! ఆ దీపమ్మ కోసం చచ్చిపో. ఆ హిమను చంపిందీ నేనే’ అని మోనిత ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా దొంగచాటుగా వంటలక్క వీడియో తీస్తుంది. ఇంతలో గన్‌ సౌండ్‌! అంజిని మోనిత షూట్‌ చేసినట్టు అనిపిస్తుంది. మరి, నిజంగా అంజిని మోనిత చంపిందా? లేదా? ఆగస్టు 5న టెలికాస్ట్‌ అయ్యే ‘కార్తీక దీపం’ 1110 ఎపిసోడ్‌లో చూడాలి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.