English | Telugu

ప‌వన్ కళ్యాణ్‌తో సినిమా మిస్స‌యిన‌ 'కార్తీకదీపం' డైరెక్టర్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని దర్శకులందరూ కోరుకుంటారు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది. అయితే అలాంటి క్రేజీ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని చెబుతున్నారు 'కార్తీకదీపం' దర్శకుడు కాపుగంటి రాజేంద్ర. బుల్లితెరపై తన సీరియల్ తో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ దర్శకుడు గతంలో 'అందం', 'బంగారు బొమ్మ' అనే సీరియల్స్ ను తెరకెక్కించారు.

అలానే ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్నాళ్లు పని చేశారు. అనంతరం మెగాఫోన్ పట్టుకొని మోహన్ బాబుతో 'శివ శంకర్', అల్లరి నరేశ్‌తో 'రాంబాబు గాడి పెళ్లాం' అనే సినిమా చేశారు. దర్శకుడిగా అనుభవం సంపాదించిన తరువాత ఈయనకు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమా ప్లాన్ చేశారు కూడా. కానీ ఆ సినిమా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి రెండుసార్లు ఆగిపోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక 'కార్తీకదీపం' సీరియ‌ల్‌ విషయంలో తనపై వస్తోన్న కంప్లైంట్స్, ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఆ సీరియ‌ల్‌లో ప్ర‌తి పాత్ర‌ను ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం వలనే ఇలాంటి స్పందనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.