English | Telugu

నరసింహా భార్య శ్వేత ఆస్తి చూసి ఫిదా అయిన అనసూయ.. పాపం దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 36 లో.. కార్తీక్ ఇంటికి రాగానే ఊరు వెళ్లిపోతున్న వాళ్ళని ఇంటికి తీసుకొని రావడం, ఇంకా బాధ్యత కూడా తీసుకోవడం చేస్తున్నారు అంట కదా అని కార్తీక్ వాళ్ళ నాన్న అంటాడు. ఎవరో వెళ్తుంటే నీ చున్ని టైర్ లో ఇరుక్కుంటుందంటూ జాగ్రత్త చెప్తాం అలాంటిది ఒక సాటి మనిషిగా సాయం చెయ్యలేమా అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత కార్తీక్ వెళ్ళిపోతాడు. నేను ఏదో సరదాకి అంటే వాడేంటి అలా మాట్లాడి వెళ్ళిపోయాడని కార్తీక్ నాన్న అంటాడు. మీరేం అనకండి అంటు కాంచన అంటుంది. దీపని వెళ్లకుండా సుమిత్ర ఆపింది కానీ పాపం దీపకేం కష్టాలు ఉన్నాయో అని కాంచన అంటుంది. మరొకవైపు నీ భర్త నిన్ను ఇంత మోసం చేసాడని ఎందుకు చెప్పలేదని దీపని సుమిత్ర అడుగుతుంది. వాడి సంగతి చెప్పి నీకు న్యాయం జరిగేలా చూస్తానని సుమిత్ర అనగానే.. వాడికి బుద్ది చెప్పి దీప జీవితం బాగు చేస్తానని అనసూయ అంటుంది. మీరు ఆ పని చేయకుంటే నేను చేస్తానని సుమిత్ర అంటుంది. రేపు ప్రొద్దున వాడి దగ్గరికి వెళ్లి వాడికి బుద్ది చెప్తాను.. నా కోడలికి అన్యాయం చేస్తాడా అని అనసూయ అంటుంది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అనసూయని తీసుకొని దీప .. నర్సింహా దగ్గరికి వెళ్తుంది. అక్కడ అనసూయని చూసి నర్సింహా భయపడతాడు. అప్పుడే శోభ వచ్చి.. నువ్వేంటి దాని కాళ్ళ దగ్గర ఉన్నావని అంటుంది. అమ్మ నన్ను క్షమించు అని నర్సింహా అనసూయతో అంటాడు. ఎందుకు ఇలా చేసావని అనసూయ అనగానే.. దీప అంటే ఇష్టం లేదు అందుకే... నేనే మూడు నెలలో వచ్చి అప్పులు తీరుద్దామని అనుకున్నాను..‌ కానీ ఆలోపే దీప వచ్చింది. ఇంటికి వెళ్లే అంటే ఒక డబ్బులున్న అతన్ని పట్టింది. వాడి చేత నన్ను కొట్టించింది ఇంకా దాని దగ్గరకి వెళ్లి ఊరు వెళ్ళమని చెప్తే ఒకావిడతో కొట్టించిందని నర్సింహా చెప్తాడు. దీప కూడా కొట్టారని చెప్పగానే.. అనసూయ నర్సింహా మాటలు నమ్ముతుంది.. ఆ తర్వాత మా అమ్మ కోటి రూపాయల విలువ గల ఇల్లు ఇచ్చింది.. పది లక్షల టాక్సీ కొనిచ్చింది.. నాకు బంగారం చేయించిందని శోభ అనగానే.. ఇదంతా బంగారమేనా అని అనసూయ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.