English | Telugu

నరసింహా భార్య శ్వేత ఆస్తి చూసి ఫిదా అయిన అనసూయ.. పాపం దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 36 లో.. కార్తీక్ ఇంటికి రాగానే ఊరు వెళ్లిపోతున్న వాళ్ళని ఇంటికి తీసుకొని రావడం, ఇంకా బాధ్యత కూడా తీసుకోవడం చేస్తున్నారు అంట కదా అని కార్తీక్ వాళ్ళ నాన్న అంటాడు. ఎవరో వెళ్తుంటే నీ చున్ని టైర్ లో ఇరుక్కుంటుందంటూ జాగ్రత్త చెప్తాం అలాంటిది ఒక సాటి మనిషిగా సాయం చెయ్యలేమా అని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత కార్తీక్ వెళ్ళిపోతాడు. నేను ఏదో సరదాకి అంటే వాడేంటి అలా మాట్లాడి వెళ్ళిపోయాడని కార్తీక్ నాన్న అంటాడు. మీరేం అనకండి అంటు కాంచన అంటుంది. దీపని వెళ్లకుండా సుమిత్ర ఆపింది కానీ పాపం దీపకేం కష్టాలు ఉన్నాయో అని కాంచన అంటుంది. మరొకవైపు నీ భర్త నిన్ను ఇంత మోసం చేసాడని ఎందుకు చెప్పలేదని దీపని సుమిత్ర అడుగుతుంది. వాడి సంగతి చెప్పి నీకు న్యాయం జరిగేలా చూస్తానని సుమిత్ర అనగానే.. వాడికి బుద్ది చెప్పి దీప జీవితం బాగు చేస్తానని అనసూయ అంటుంది. మీరు ఆ పని చేయకుంటే నేను చేస్తానని సుమిత్ర అంటుంది. రేపు ప్రొద్దున వాడి దగ్గరికి వెళ్లి వాడికి బుద్ది చెప్తాను.. నా కోడలికి అన్యాయం చేస్తాడా అని అనసూయ అంటుంది.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అనసూయని తీసుకొని దీప .. నర్సింహా దగ్గరికి వెళ్తుంది. అక్కడ అనసూయని చూసి నర్సింహా భయపడతాడు. అప్పుడే శోభ వచ్చి.. నువ్వేంటి దాని కాళ్ళ దగ్గర ఉన్నావని అంటుంది. అమ్మ నన్ను క్షమించు అని నర్సింహా అనసూయతో అంటాడు. ఎందుకు ఇలా చేసావని అనసూయ అనగానే.. దీప అంటే ఇష్టం లేదు అందుకే... నేనే మూడు నెలలో వచ్చి అప్పులు తీరుద్దామని అనుకున్నాను..‌ కానీ ఆలోపే దీప వచ్చింది. ఇంటికి వెళ్లే అంటే ఒక డబ్బులున్న అతన్ని పట్టింది. వాడి చేత నన్ను కొట్టించింది ఇంకా దాని దగ్గరకి వెళ్లి ఊరు వెళ్ళమని చెప్తే ఒకావిడతో కొట్టించిందని నర్సింహా చెప్తాడు. దీప కూడా కొట్టారని చెప్పగానే.. అనసూయ నర్సింహా మాటలు నమ్ముతుంది.. ఆ తర్వాత మా అమ్మ కోటి రూపాయల విలువ గల ఇల్లు ఇచ్చింది.. పది లక్షల టాక్సీ కొనిచ్చింది.. నాకు బంగారం చేయించిందని శోభ అనగానే.. ఇదంతా బంగారమేనా అని అనసూయ ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.