English | Telugu

‘జబర్దస్త్‌’లో అసంతృప్తి జ్వాలలు! బ‌య‌ట‌ప‌డిన‌ వెంకీ!!

‘జబర్దస్త్‌’లో వెంకీ కొన్నేళ్ళుగా టీమ్‌ లీడర్‌గా చేస్తున్నాడు. ‘జబర్దస్త్‌’లో ‘వెంకీ మంకీస్‌’ టీమ్‌ కంటిన్యూస్‌గా స్కిట్లు చేస్తోంది. అతడి టీమ్‌లో ఉండి పేరు తెచ్చుకున్న జీవన్‌ ప్రజెంట్‌ టీమ్‌ లీడర్‌గా చేస్తున్నాడు. ప్రసాద్‌ మధ్యలో కొన్నిరోజులు నరేష్‌తో కలిసి టీమ్‌ లీడర్‌గా చేశాడు. తర్వాత ‘పంచ్‌ ప్రసాద్‌ – నాటీ నరేష్‌’ టీమ్‌ను తీసేశారు. దాంతో ఇప్పుడు వెంకీతో పాటు ఇతర టీమ్‌ లీడర్ల స్కిట్లలో చేస్తున్నాడు. టీమ్స్‌ను తగ్గించిన తర్వాత తాగుబోతు రమేష్‌ను తీసుకొచ్చి వెంకీ మంకీస్‌ టీమ్‌తో కలిపారు. దాంతో పేరు మొత్తం తనకు రావడం లేదనే అసంతృప్తి వెంకీలో ఉన్నట్టుంది. లేటెస్ట్‌ ‘జబర్దస్త్‌’ ప్రోమో సాక్షిగా అది బయటపడింది.

‘ఏం వెంకీ! ఏమైంది?’ అని జడ్జ్‌ మనో అడిగారు. ‘చేసేది నేను... చేయించేది నేను’ అని వెంకీ చెప్పాడు. అప్పుడు అతడి ముఖంలో సంతోషం అనేది లేదు. ‘నువ్వు చేయించినా వాళ్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు’ అని వెంకీ టీమ్‌లో ఇతర సభ్యుల్ని తక్కువ చేయకుండా చెప్పారు మ‌నో. వెంకీ వెనక్కి తిరిగి అసంతృప్తికి లోనయ్యాడు. అతడి దగ్గరకు తాగుబోతు రమేష్‌ వెళ్ళగా, వద్దన్నట్టు సైగ చేశాడు. ఇదంతా ప్రోమోలో చూపించడం వల్ల ‘జబర్దస్త్‌’ షో నిర్మాతలు ఏం చెప్పాలనుకున్నారో?

‘జబర్దస్త్‌’ ఎంతోమంది కమెడియన్లకు వేదిక కల్పించింది. కల్పిస్తోంది. సినిమాల్లో నటీనటుల కంటే కొందరికి ఎక్కువ పేరు వస్తోంది. అయితే, షోలో కొందరు కమెడియన్లు అసంతృప్తిలో ఉన్నమాట వాస్తవమే. అది తమకు వచ్చే పేరు విషయంలో కాదు, పేమెంట్స్‌ విషయంలో! క్యారెక్టర్‌ చిన్నదైనా కామెడీ బాగా చేస్తే ఆలోమేటిక్‌గా పేరు వస్తుంది. అందులో మరో సందేహం లేదు. కానీ, పేమెంట్స్‌ విషయంలో టీమ్‌ లీడర్లపై కొంతమంది ఫన్నీగా సెటైర్లు వేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అసంతృప్తి జ్వాలలు టీమ్‌ లీడర్‌లో రావడం గమనార్హం.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.