English | Telugu

భీమ్ పాటని మందు పాటగా మార్చేసిన చలాకీ చంటి

హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ క‌డుపుబ్బా న‌వ్విస్తున్న కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా ఈటీవిలో ప్ర‌సారం అవుతున్న ఈ కామెడీ షో టాప్ టీఆర్పీ రేటింగ్ తో కొన‌సాగుతోంది. ఈ షోకు ప్ర‌ముఖ గాయ‌కుడు మ‌నో, న‌టి ఇంద్ర‌జ జడ్జిలుగా, అన‌సూయ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక టీమ్ లీడ‌ర్స్ గా తాగుబోతు ర‌మేష్‌, రాకెట్ రాఘ‌వ‌, చ‌లాకీ చంటి, సునామీ సుధాక‌ర్‌, రైజింగ్ రాజు, శాంతి స్వ‌రూప్‌ ప్ర‌స్తుతం జ‌బ‌ర్త‌స్త్ షోలో స్కిట్ లు చేస్తున్నారు. ఈ గురువారం రాత్రి ప్ర‌సారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు.

రాకెట్ రాఘ‌వ `వాన జ‌ల్లు గిల్లుతుంటే..` అనే పాట‌తో ప్రోమో మొద‌లైంది. బామ్మ‌గా తాగుబోతు ర‌మేష్ చేసిన ఫీట్లు న‌వ్వులు పూయిస్తున్నాయి. రాకెట్ రాఘ‌వ రెయిన్ సాంగ్ చేసి వ‌స్తే అత‌ని భార్య ప్లేట్ తో ఎంట్రీ ఇస్తుంది. 'ఏంటీ నువ్వు దిష్టి తీయ‌డానికి రాలేదా?' అంటే 'నీ బెండు తీయ‌డానికి వ‌చ్చాను రా?' అంటూ రాఘ‌వ‌ని చెడుగుడు ఆడుకోవ‌డం... త‌న ఫ్రెండ్ పెళ్లి కోసం బామ్మ‌గా మారిన తాగుబోతు ర‌మేష్ చేసిన ఫీట్లు.. వేసిన వేషాలు న‌వ్వులు పూయించేలా వున్నాయి.

ఇక వీళ్ల త‌రువాత స్టేజ్ పై కొచ్చిన చ‌లాకీ చంటీ తాగుబోతుల స్కిట్ తో న‌వ్వులు పూయించాడు. 'మందేస్తూ చిందెయ్ రా'.. అనే సాంగ్ తో త‌న టీమ్ తో ఎంట్రీ ఇచ్చిన చ‌లాకీ చంటీ 'అంద‌రికీ ఓ దిన‌ముంది.. మాక్కూడా ఓ దినం కావాలే' అంటాడు. దీంతో చంటి ప‌క్క‌నే వున్న వ్య‌క్తి 'తాగుబోతుల దినోత్స‌వ‌మా?' అన‌గానే అత‌ని చెంప ప‌గ‌ల‌గొట్టిన చలాకీ చంటి.. 'తాగుబోతు అంటావుర‌ న‌న్ను.. ఎంపీపీ మ‌ధ్య పాన ప్రియుడు అనాల‌'న్నాడు.

ఆ త‌రువాత `ఆర్ ఆర్ ఆర్‌` సినిమాలోని `కొమురం భీముడో..` పాట‌ని మందు పాట‌గా మార్చేశాడు. `విస్కీదేవాలా బ్రాండీ దేవాలా... గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట ప‌క్క‌నా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్క‌కీ ముక్క ముక్క‌తో జుర్రుకోవాలా... దొబ్బితాగాలా..` అంటూ కొమురం భీముడో పాట‌ని చ‌లాకీ చంటి తాగుబోతుల పాట‌గా మార్చేశాడు. దీంతో ఈ ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తూ వైర‌ల్ గా మారింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.