English | Telugu

Illu illalu pillalu : ఇంట్లో కొత్త కోడలి ఫోటోషూట్.. బామ్మర్దిని ఈడ్చికొట్టిన రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో.....ధీరజ్, తిరుపతి వాళ్ళతో పడుకోవడానికి బయటకు వస్తాడు. దాంతో ప్రేమ ఒక్కతి గదిలో భయపడుతుంది.. వెళ్లి లోపల పడుకోమని తిరుపతి, చందులు బలవంతంగా ధీరజ్ ని లోపలికి పంపిస్తారు. ధీరజ్ గదిలోకి వెళ్లేసరికి ప్రేమ కోపంగా ఉంటుంది. నేను బెడ్ పైన పడుకుంటానని ధీరజ్ అంటాడు. నేను ముందు అంటే ఏదో అన్నట్లున్నావ్ అంటు తన మాట తనకే చెప్తుంది ప్రేమ‌.

ఆ తర్వాత ధీరజ్ నొప్పులతో నేలపైన పడుకుంటాడు. మరొకవైపు సాగర్, నర్మదలు రామరాజుతో చందు మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటారు. నిజంగా బావగారు చాలా గ్రేట్ అని నర్మద అంటుంది. మరి నేను గ్రేట్ కాదా అని సాగర్ అంటాడు. ఇద్దరు కాసేపు ప్రేమగా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ప్రేమ తన ఇంటి ముందుకి వచ్చి.. తన తల్లి రేవతిని పిలుస్తుంది. అయిన రేవతి పలకదు. లోపలికి వెళ్లి రేవతి ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ కూడా బాధపడుతుంటే.. అప్పుడే నర్మద వచ్చి బాధపడకని చెప్తుంది.

ఆ తర్వాత రామరాజు, వేదవతిలు చందుకి అమ్మయిని చూడడానికి వెళ్తారు. తరువాయి భాగంలో ఇద్దరు వెళ్తుంటే.. భద్రవతి చూస్తూ ఉంటుంది. పెళ్లి చూపులకి వెళ్లి అమ్మాయి బాగుందని వేదవతి చెప్తుంది. రామరాజు, వేదవతిలు ఇంటికి వచ్చేసరికి ప్రేమ, ధీరజ్ లకి తిరుపతి ఫోటోషూట్ జరిపిస్తాడు. దాంతో రామరాజు కోపంగా తిరుపతి చెంప చెళ్లుమనిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.