English | Telugu

బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్  ఎన్టీఆర్ గారు ఇష్టమా ? విశ్వక్ కి షాక్ ఇచ్చిన సుధీర్

ఫ్యామిలీ స్టార్ప్రోమోలో యాంకర్ సుడిగాలి సుధీర్ విశ్వక్ ని అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా షాకయ్యాడు. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున "లైలా" మూవీతో ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ హీరోగా ఒక లేడీ గెటప్‍‌ లో కనిపించబోతున్నాడు . ఈ మూవీ ప్రమోషన్స్ కోసం లైలా మూవీ టీమ్ ఫామిలీ స్టార్స్ సెట్ కి వచ్చారు. ఇక ఈ షోలో సుధీర్‌తో పాటు యాంకర్ స్రవంతి, అషూ రెడ్డి కూడా సందడి చేశారు. వీళ్ళ ఇద్దరితో కలిసి స్టెప్పులు వేశాడు విశ్వక్. ఇక ప్రోమో చివరిలో బాలకృష్ణ విశ్వక్‌ సేన్ కి ముద్దు పెడుతున్న పిక్ చూపించి ఇంట్రెస్టింగ్ కొశ్చన్ అంటూ అడిగాడు సుధీర్. "ఆ టైమ్‌లో టక్ మని బాలయ్య మీకు ముద్దు పెట్టగానే మీకు ఏం అనిపించింది" అంటూ సుధీర్ అడిగాడు. ముందుగా ఆయనకు పద్మభూషణ్ వచ్చినందుకు కంగ్రాట్స్ అని చెప్పాడు విశ్వక్. "మీరు ఇప్పటికీ ఆయన్ని బ్రో" అనే పిలుస్తారా అనేసరికి అవును అన్నాడు..

ఆ మాటకు ఇక సుదీర్ "మాదొకటే సర్ జై బాలయ్య" అని అరిచాడు. తర్వాత " బాలకృష్ణ గారు ఇష్టమా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టమా" అంటూ సుధీర్ అడిగాడు. దాంతో ఎం ఆన్సర్ చెప్పాలో విశ్వక్ కి అర్థంకాక అసలు ఏ టైంలో ఎం ప్రశ్న అడిగావు సుధీర్ అంటూ ఒక లుక్ ఇచ్చాడు విశ్వక్. మరి ఇంతకు ఎం ఆన్సర్ ఇస్తాడో ఎపిసోడ్ లోనే చూడాలి. ఐతే సుధీర్ ఇంకోటి కూస విశ్వక్ ని అడిగాడు "సార్.. టీజర్ లాస్ట్‌లో ఒకావిడ వచ్చింది కదా.. ఆవిడ నంబర్ ఉంటే ఇస్తారా" అంటూ కొంటెగా అడిగాడు. అప్పుడు కూడా విశ్వక్ ఒక రేంజ్ లో చూసాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.