English | Telugu
నన్ను పెళ్లి చేసుకుంటావా?.. పవిత్రకు ప్రపోజ్ చేసిన సంతోష్!
Updated : Sep 19, 2022
'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ వారం సోసోగా సాగింది. ఐతే ఇందులో ఫైనల్ ట్విస్ట్ గా కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు. ఆది తను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయికి రాసిన లవ్ లెటర్ ని ఫన్నీగా చదివి వినిపించాడు. ఇమ్మానుయేల్ తను 8th క్లాస్ చదివేటప్పుడు తన ఫస్ట్ లవ్ కొనిపెట్టిన జామెట్రీ బాక్స్ ని చూపించి దాని హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఇక పంచ్ ప్రసాద్ తన ఫస్ట్ లవ్ ఐన సునీతకు కొనిచ్చిన రింగ్ ని చూపించాడు. నిజ జీవితంలో సునీతనే పెళ్లి చేసుకున్నాడు ప్రసాద్.
ఇక ఈ జోడి పెయిర్ లో పరదేశి జోడి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్యను స్టేజి మీదకు తీసుకొచ్చి ప్రపోజ్ చేసాడు పరదేశి. అలాగే తన గుండెల మీద పొడిపించుకున్న ఆమె పచ్చబొట్టు పేరు చూపించి తన ప్రేమను యాక్సెప్ట్ చేయమంటూ అడిగేసరికి ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది.
అలాగే పవిత్రకి కూడా యాంకర్ రష్మీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సంతోష్ అనే వ్యక్తిని స్టేజి మీదకు పిలిచారు. అతను వచ్చి తన ప్రేమనంతా గొప్ప కవిత్వంగా మార్చేసి చెప్పేసి పవిత్ర ఫోటోతో ఒక లామినేషన్ చేసి ఇచ్చేసాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని రింగ్ ఇచ్చి మరీ అడిగేసరికి పవిత్ర షాకైపోయింది.
"అసలు అతనెవరో నాకు తెలియాలి. నన్నెప్పటినుంచి ప్రేమిస్తున్నావ్? అసలు నేనంటే నీకు ఎందుకంత ఇష్టం" అంటూ ప్రశ్నించే సరికి స్టేజి మీద అందరూ స్టన్నయ్యారు. "నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాం, చేసాం" అని రష్మీ చెప్పేసరికి అదంతా నిజమో, అబద్ధమో అర్థం కాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.