English | Telugu

నన్ను పెళ్లి చేసుకుంటావా?.. ప‌విత్ర‌కు ప్ర‌పోజ్ చేసిన సంతోష్‌!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ వారం సోసోగా సాగింది. ఐతే ఇందులో ఫైనల్ ట్విస్ట్ గా కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు. ఆది తను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయికి రాసిన లవ్ లెటర్ ని ఫన్నీగా చదివి వినిపించాడు. ఇమ్మానుయేల్ తను 8th క్లాస్ చదివేటప్పుడు తన ఫస్ట్ లవ్ కొనిపెట్టిన జామెట్రీ బాక్స్ ని చూపించి దాని హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఇక పంచ్ ప్రసాద్ తన ఫస్ట్ లవ్ ఐన సునీతకు కొనిచ్చిన రింగ్ ని చూపించాడు. నిజ జీవితంలో సునీతనే పెళ్లి చేసుకున్నాడు ప్రసాద్.

ఇక ఈ జోడి పెయిర్ లో పరదేశి జోడి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్యను స్టేజి మీదకు తీసుకొచ్చి ప్రపోజ్ చేసాడు ప‌ర‌దేశి. అలాగే తన గుండెల మీద పొడిపించుకున్న ఆమె పచ్చబొట్టు పేరు చూపించి తన ప్రేమను యాక్సెప్ట్‌ చేయమంటూ అడిగేసరికి ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది.

అలాగే పవిత్రకి కూడా యాంకర్ రష్మీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సంతోష్ అనే వ్యక్తిని స్టేజి మీదకు పిలిచారు. అతను వచ్చి తన ప్రేమనంతా గొప్ప కవిత్వంగా మార్చేసి చెప్పేసి పవిత్ర ఫోటోతో ఒక లామినేషన్ చేసి ఇచ్చేసాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని రింగ్ ఇచ్చి మరీ అడిగేసరికి పవిత్ర షాకైపోయింది.

"అసలు అతనెవరో నాకు తెలియాలి. నన్నెప్పటినుంచి ప్రేమిస్తున్నావ్? అసలు నేనంటే నీకు ఎందుకంత ఇష్టం" అంటూ ప్రశ్నించే సరికి స్టేజి మీద అందరూ స్ట‌న్న‌య్యారు. "నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాం, చేసాం" అని రష్మీ చెప్పేసరికి అదంతా నిజమో, అబ‌ద్ధ‌మో అర్థం కాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.