English | Telugu

‘ఆ శ్రీరాముడికి ఒక లక్ష్మణుడు.. నాకు ఇద్దరు లక్ష్మణులు’!

'ఆట' షోతో స్టార్ అయ్యాడు. చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు యూనివర్సల్ అన్నయ్యగా మారిపోయాడు. తన షోస్ లో ఒక క్రియేటివిటీతో ముందుకు దూసుకెళ్తూ తనకు డాన్స్ రాకపోయినా 'డాన్స్ ఐకాన్' పేరుతో ఒక డాన్స్ షో చేస్తూ ఆడియన్స్ తో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఓంకార్. ఆయన తన లైఫ్ కి సంబంధించి, షోస్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఒక ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నాడు.

"ఆ శ్రీరాముడికి ఒక లక్ష్మణుడు ఐతే నాకు ఇద్దరు లక్ష్మణులు. వాళ్ళే.. నా తమ్ముళ్లు. నాకు పేరొస్తుందని వాళ్లకు రావడం లేదని ఎప్పుడూ బాధపడరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకోవడం కంటే కూడా నా తమ్ముళ్ళతోనే ఆడుకునేవాడిని. స్కూల్ కి వెళ్ళేటప్పుడు చిన్న తమ్ముడిని ముందు, పెద్ద తమ్ముడిని వెనక ఎక్కించుకుని వెళ్ళేవాడిని. నా మాట చిన్నప్పటినుంచీ వాళ్ళు జవదాటరు. నా ప్రోగ్రామ్స్, మూవీస్ లో ఏది సక్సెస్ ఐనా కూడా దాన్ని నా సక్సెస్ అని కాకుండా ఇది మా ఫ్యామిలీ సక్సెస్ గా చూస్తాం. మా ఇంటికి వచ్చిన తమ్ముళ్ల భార్యలు కూడా అర్థం చేసుకునే వాళ్లే వచ్చారు కాబట్టి మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు." అని ఆయ‌న చెప్పాడు.

"నాన్న డాక్టర్ ఐనా కూడా పూజలూ, అవీ చేస్తుంటారు. వాటి ఫలితంగా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. మా ఎవరి మధ్యన ఏ సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నాం. మా ముగ్గురన్నదమ్ముల పిల్లలు కూడా అంతే బాండింగ్‌తో ఇంట్లో పెరుగుతూ ఉన్నారు. 'ఆట' డాన్స్ షో ద్వారా పరిచయమైన వారిలో నేను ఎక్కువగా చూసి గర్వపడేది ఆట సందీప్, లుక్స్ రాజశేఖర్, మల్లేష్.. 'ఆట జూనియర్స్'లో గీతిక నా ఆల్ టైం ఫేవరేట్. నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక గాడ్‌ఫాదర్ అల్లు అరవింద్ గారు. నా ఎదుగుదలలో ఆయనదే ముఖ్య భాగం. అని వెల్ల‌డించాడు.

"ఇక నా షోస్ విషయానికి వస్తే.. 'మాయాద్వీపం' షోలో ప్రతీ ఒక్కరు నన్ను అన్నయ్య అనే పిలుస్తుండ‌టంతో అందరితో బాండింగ్ కుదిరింది. నాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చింది 'ఆట'. సెకండ్ ఇన్నింగ్స్ ని 'సిక్స్త్ సెన్స్' ద్వారా స్టార్ట్ చేసాను. 'ఇష్మార్ట్ జోడి' అనేది ఒక ఇన్స్పిరేషనల్ బాండింగ్ షో. నా కెరీర్ లో ది టాప్ మోస్ట్ షో డాన్స్ ఐకాన్. " అంటూ ఓంకార్ ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.