English | Telugu

ఆయనతో నటించాలనే కోరిక అలాగే ఉండిపోయింది!

టాలీవుడ్ లో టాప్ హీరోస్ తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గీత. ఇక ఇప్పుడు ఈమె ఆలీతో సరదాగా షో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి ఫాన్స్ తో ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఆల్ టైం ఫేవరేట్ అని కానీ ఒక కోరిక మిగిలిపోయిందని అదే ఆయనతో నటించలేకపోవడమే అని ఆమె బాధపడ్డారు.

ఆయనతో కలిసి ఒక్క మూవీలో ఐనా నటించాలనుందని ఆమె అన్నారు. ఇక ఈమె తన చిన్ననాటి సంగతులను కూడా గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. ఒకరోజు స్కూల్లో ఫ్రెండ్స్ తో కలిసి జారుడు బల్ల ఆడుకుంటూ ఇంటికి ఆలస్యంగా వెళ్లేసరికి తన తండ్రి బెల్టుతో చితక్కొట్టారంటూ చెప్పారు. ఇక స్కూల్లో టాప్ ర్యాంకర్స్ తోనే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేవారట గీత ఎందుకంటే అసలే చదువులో వీక్ కాబట్టి వాళ్ళతో స్నేహం చేస్తే బిట్స్ అవి చూసి కాపీ కొట్టడానికి మంచి అవకాశం దొరుకుతుంది కదా అంటూ నవ్వుతూ చెప్పింది గీత. తాను చదువుకున్నది జస్ట్ 8th క్లాస్ మాత్రమే అని చెప్పారు.

వెంటనే ఇండస్ట్రీలోకి వచ్చేశానన్నారు. భైరవి సినిమా తర్వాత కృష్ణంరాజు గారు నటించిన మన ఊరి పాండవులు సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు ఇది తనకు రెండవ సినిమా అని అన్నారు. ఇలా గీత తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..