English | Telugu
నాగార్జున సాక్షిగా భరణిపై కమెడియన్ శ్రీనివాస రెడ్డి దాడి.. కప్పుతోనే రావాలి డాడీ!
Updated : Nov 24, 2025
బిగ్ బాస్ సీజన్-9 ఫ్యామిలీ వీక్ నిన్నటితో ముగిసింది. నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో సుమన్ శెట్టి పిల్లలు గౌతమ్, రూపికలతో పాటు కమెడియన్ శ్రీనివాస రెడ్డి స్టేజ్ మీదకి వచ్చారు. సుమన్ శెట్టి అయితే తన పిల్లల్ని చూసుకొని తెగ మురిసిపోయాడు. ఇక భరణి గురించి శ్రీనివాస రెడ్డి చెప్పిన మాటలకి నాగార్జున సహా అందరూ తెగ నవ్వుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందో చూసేద్దాం.
మీ లైఫ్లో ఒక టాప్ సీక్రెట్ మీరు రివీల్ చేస్తే మీ ఫ్యామిలీ మెంబర్ వస్తారంటూ నాగార్జున అన్నాడు. దీంతో సుమన్ శెట్టి లేచి.. సర్ ఇంట్లో నైట్ షూటింగ్ అని చెప్పి ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తాను సర్ అంటూ సీక్రెట్ చెప్పాడు. పార్టీలకి వెళ్తావ్ అక్కడ ఏం జరుగుతుంది.. అని నాగార్జున అడుగగా.. అదే సర్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటామని సుమన్ శెట్టి చెప్తుంటే ఏయ్ ఏయ్ అంటూ పక్కనుంచి అందరు ఆటపట్టించారు. సుమన్ శెట్టి చెప్పిన సీక్రెట్ కి నాగార్జున తన ఫ్యామిలీ రావడానికి ఒకే చెప్పాడు. కాసేపటికి సుమన్ శెట్టి పిల్లలు గౌతమ్, రూపికతో పాటు కమెడియన్ శ్రీనివాస రెడ్డి స్టేజ్ మీదకి వచ్చారు. వీళ్లని చూడగానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు సుమన్. నాకా ఇది అంటూ శ్రీనివాస రెడ్డి అడిగితే పిల్లలకి అంటూ నవ్వుకున్నాడు. సుమన్ శెట్టి కూతురు రూపిక మాట్లాడుతూ.. చాలా బాగా ఆడుతున్నారు నాన్న.. గేమ్స్ అన్నీ బాగా ఆడుతున్నారు.. ట్రోఫీ తీసుకొని ఇంటికి రావాలి అంటూ చెప్పింది. ఖచ్చితంగా తల్లీ అంటూ సుమన్ మురిసిపోయాడు. తర్వాత బాక్స్లో నుంచి ఒక క్యారెక్టర్ ఫొటోని శ్రీనివాస రెడ్డి తీశాడు. అందులో దూకుడు సినిమాలో బ్రహ్మానందం చేసిన పద్మశ్రీ పాత్ర ఫొటో వచ్చింది. ఇది హౌస్ లోని ఏ కంటెస్టెంట్ కి ఇస్తావని అంటే మా సుమన్ కి ఇస్తాను సర్ అని చెప్పాడు. కెమెరాకి కూడా కరెక్ట్గా ఇలాగే ఉంటాడంటూ శ్రీనివాస రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత అపరిచితుడు ఫోటో రాగా దానిని తనూజకి డెడికేట్ చేశాడు. పాజిటివ్ గానే తీసుకోండి. మీరు ఒకసారి కోపం, ఒకసారి చిరాకు.. ఒకసారి ఏడుపు.. ఇలా మూడ్ మారిపోతుందని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు.
ఇక తర్వాత భరణి గురించి శ్రీనివాస రెడ్డి చెప్పిన మటలకి అందరూ తెగ నవ్వుకున్నారు. భరణి గారు రోడ్ సైడ్ చెరుకు బండ్లు కనబడుతుంటాయి.. అదేంటో ఆ మిషన్ ప్లేస్లో నువ్వే కనబడుతుంటావ్.. వాటిల్లో నుంచి నలిగి రసం బయటికి వస్తుంటుంది.. ఇక్కడేమో నీ నుంచి ఏం రాదు కానీ రెండువైపుల నుంచి రసాలేంటి నవరసాలు బయటకొస్తున్నాయంటూ శ్రీనివాస రెడ్డి చెప్పగానే పక్కనే ఉన్న నాగార్జున పడిపడి నవ్వుకున్నాడు. అటు తనూజ ఇటు దివ్య ఇద్దరి మధ్య చెరుకు గడలా భరణి నలిగిపోతున్నాడంటూ ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. దీనికి భరణి కూడా బాగా నవ్వుకున్నాడు. ఇక అందరు బాగా ఆడుతున్నారని చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. సుమన్ తన కొడుకు , కూతురికి బై చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయాక ఎమోషనల్ అయ్యాడు.