English | Telugu

వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన సుమ!

యూట్యూబ్‌లో హిట్టయిన వెబ్ సిరీస్‌ '30 వెబ్స్ 21' చూశారా? అందులో తొలి ఎపిసోడ్‌లోనే హీరో హీరోయిన్లు చైతన్య, అనన్యకు పెళ్లైనట్టు చూపిస్తారు. ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉంటుంది. కానీ, పెళ్లి సీన్ ఉండదు. హాస్పటల్‌లో అమ్మాయిని అబ్బాయి చూడటం... కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లైనట్టు చెప్పి డైరెక్టుగా ఫస్ట్ నైట్ సీన్‌లోకి వెళతారు. ఆ పెళ్లి తంతు జరిగితే ఎలా ఉంటుందో... 'స్టార్ మా' ఛానల్ షో 'స్టార్ట్‌ మ్యూజిక్‌లో సుమ చూపించారు.

హాస్పటల్‌లో అబ్బాయి, అమ్మాయి చూపులకు భిన్నంగా 'స్టార్ట్ మ్యూజిక్' షోలో సుమ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడమే కాదు... ఇద్దరికీ పెళ్లి చేసింది. 'మొత్తానికి మీ సిరీస్ లో జరగని పెళ్లి మా సిరీస్ లో జరిగింది' అని సుమ అంటే... 'సిరీస్ లో చాలా జరగలేదు' అని చైతన్య అన్నాడు. అందుకు అనన్య నవ్వింది. కమింగ్ సండే మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

చైతన్య, అనన్యతో పాటు 'రామ్ లీల', 'మేడమ్ సార్ మేడమ్ అంతే' హీరో హీరోయిన్లు శ్రీహాన్, సిరి హనుమంతు... 'సూర్య' హీరో హీరోయిన్లు షణ్ముఖ్ జస్వంత్, మౌనిక ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.