English | Telugu

Brahmamudi : యావదాస్తిని కావ్యకి రాసిచ్చిన ఇంటిపెద్ద.. షాక్ లో ఆ ముగ్గురు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -591 లో....రాజ్ గదిలో ఇంట్లో జరుగుతున్న సంఘటనలకి బాధపడుతుంటే.. కావ్య వస్తుంది. మీరు ఈ ఇంటికి వారసుడు.. మీరు ఎందుకిలా బాధపడుతున్నారని కావ్య అనగానే.. ఆ విషయం నువ్వు చెప్తే గానీ నాకు అర్థం కావడం లేదంటూ చిరాకుగా మాట్లాడతాడు. మరొకవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి.. మంచి పని చేసావ్.. నీ వళ్లనే కొడుకుకి న్యాయం జరుగుతుంది.. అలాగే నా కొడుకుకి న్యాయం జరుగుతుందని రుద్రాణి అంటుంది. నీకు థాంక్స్ అని రుద్రాణి అనగానే.. అసలు నీకే థాంక్స్ చెప్పాలి ఈ ఆలోచన నాకు ఇచ్చావని ధాన్యలక్ష్మి అంటుంది.

అప్పుడే ప్రకాష్ వచ్చి ఇద్దరిని తిడతాడు. ఇప్పుడు నీ వల్ల ఆస్తులు ముక్కులు కావచ్చు.. నువ్వు అనుకున్నది జరగవచ్చు.. కొన్ని రోజులకి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమవుతుందని ధాన్యలక్ష్మిపై ప్రకాష్ విరుచుకుపడతాడు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వెళ్తుంటే.. ఎక్కడికి రాజ్.. లాయర్ వస్తున్నాడని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే లాయర్ వస్తాడు. అందరికి ఆస్తులు వాటా రాయండి అని సుభాష్ అనగానే.. మీకు మీ నాన్నగారు వారం క్రితం రాసిన వీలునామా గురించి చెప్పలేదా అని లాయర్ అంటాడు. లేదని అనగానే స్వయంగా లాయర్ అందరి ముందు సీతారామయ్య వీలునామా చదువుతాడు. యావదాస్తిని నా మనవరాలు కావ్య పేరునా రాస్తున్నానని సీతారామయ్య రాసినట్టుగా ఉంటుంది. అది విని అందరు షాక్ అవుతారు. ఒక సుభాష్, అపర్ణ ఇందిరాదేవి, ప్రకాష్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. నా బావ కుటుంబం ముక్కలు కాకుండా చూసాడని ఇందిరాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు తనకి ఆస్తులు రాయడమేంటి ఈ ఇంటి వారసులకి రాయాలని అంటారు. దీన్ని నేను ఒప్పుకోను.. నేను కోర్ట్ కి వెళ్తానని ధాన్యలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. మరొకవైపు కావ్య తన బాధని దేవుడికి చెప్పుకుంటుంది. తరువాయి భాగంలో ఆస్తి పేపర్స్ తాళాలు ఇవి.. నాకు వద్దు ఈ బాధ్యతలు మీవే అని రాజ్ కి ఇస్తుంది కావ్య. ఇవి నీ దగ్గర ఉంటేనే బాగుంటుంది తాతయ్య.. పెట్టుకున్న నమ్మకం కాపాడమని కావ్యతో రాజ్ పాజిటివ్ గా మాట్లాడగానే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.