English | Telugu

Brahmamudi : కళ్యాణ్ కోసం రాహుల్ ప్లాన్.. ఆమె వెన్నెల అని కావ్య కనిపెట్టగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -384 లో.. దేవుడికి కావ్య తన బాధని చెప్పుకుంటూ ఉంటే ఇందిరాదేవి వస్తుంది. వెన్నెలని కలుస్తున్నానంటూ ఇందిరాదేవికి కావ్య చెప్పగా.. అసలు నా వల్లే ఇదంతా అని ఇందిరాదేవి బాధపడుతుంది. మరొకవైపు ఇప్పుడు నీచేత ఒక తప్పు చేయించబోతున్నాను రా కళ్యాణ్ అని రాహుల్ అనుకుంటాడు.

అ తర్వాత రాహుల్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. నువ్వు ఫారెన్ నుండి దొంగతనంగా తీసుకొని వచ్చిన టెన్ కేజీస్ బంగారం తీసుకొని మా కంపెనీకి రా అని చెప్తాడు. అది ఆఫీషియల్ గా మా కంపెనీ కొనేలా నేను ప్లాన్ చేస్తానని రాహుల్ అంటాడు. ఏదైన ప్రాబ్లమ్ అయితే అని అతను అడుగగా.. దానికి ఇక్కడ ఒక బకరాగాడు ఉన్నాడులేరా అని రాహుల్ అంటాడు. అందులో ట్వంటీ పర్సెంట్ కావాలని రాహుల్ అంటాడు. ఇక ఆ తర్వాత.. ఒరేయ్ కళ్యాణ్ దీంతో నువ్వు జైలుకు నేను ఎండీ చైర్ లోకి అని రాహుల్ అనుకుంటాడు. తర్వాత దానికి సంబంధించిన ఫైల్ ని కళ్యాణ్ కి చూపిస్తాడు. మరొకవైపు రీయూనియన్ పేరిట ఓల్డ్ స్టూడెంట్స్ అందరు పార్టీలో కలుస్తారు. అ తర్వాత అక్కడికి కావ్య, రాజ్ కూడా వస్తారు. అందరు కాసేపు మాట్లాడుకుంటారు. కావ్య, శ్వేత ఇద్దరు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు. ఇదంతా ప్లాన్ చేసింది వెన్నెల కోసం.. అసలు తను వస్తుందా అని కావ్య అడుగగా.. వస్తుందని శ్వేత చెప్తుంది. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమని శ్వేతతో కావ్య అంటుంది. కాసేపటికి వెన్నెలకి శ్వేత ఫోన్ చేస్తుంది. వస్తున్నానని వెన్నెల చెప్తుంది. తను వస్తే ఒక పరిష్కారం దొరుకుతుందని కావ్య అనుకుంటుంది. అ తర్వాత కనకం పక్కింటావిడ అప్పుకి రెండవ పెళ్లి సంబంధం తీసుకొని వస్తుంది. దాంతో తనని కనకం, అప్పు ఇద్దరు తిట్టి పంపిస్తారు.

మరొకవైపు రీయూనియన్ పార్టీలో అందరు సరదాగా కబుర్లు చెప్పుకుంటు ఉంటారు. ట్రూత్ ఆర్ డేర్ ఆడుతుంటారు. రాజ్ వంతు కాగా నీ భార్య మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాలని శ్వేత అనగానే.. కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తుంటే కావ్య కూడా ఇంప్రెస్ అవుతుంది. తరువాయి భాగంలో శ్వేత ద్వారా వెన్నెల పార్టీకీ వస్తున్న విషయం రాజ్ కి తెలుస్తుంది. దాంతో రాజ్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు వెన్నెల వస్తే అంతా తెలిసిపోతుందనని రాజ్ టెన్షన్ పడతాడు. ఏ వెన్నెల.. నాకు తెలిసిన వెన్నెలనేనా అని కావ్య అంటుంది. అప్పుడే వెన్నెల కార్ లో నుండి దిగుతుంది. రాజ్ తనని చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.