English | Telugu

Guppedantha Manasu : మను తండ్రిని నేనే అని చెప్పేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1050 లో.. పేరెంట్స్, లెక్చరర్ మీటింగ్ లో వసుధార అందరి పేరెంట్స్ తో మాట్లాడుతుంది. ఒక్కొక్క స్టూడెంట్ కాలేజీకి రాకపోవడంపై గల కారణం అడిగి తెలుసుకుంటుంది. కాలేజీకీ వస్తే కలిగే లాభాల గురించి గొప్పగా చెప్తుంది.

ఆ తర్వాత ఒక స్టూడెంట్ పేరెంట్ ని.. మీ అబ్బాయి ఎందుకు కాలేజీకి రావడం లేదని మను అడుగుతాడు. ఒక తండ్రిగా మీరే కొడుకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటూ తండ్రి గురించి మను గొప్పగా చెప్తుంటాడు. మరొకవైపు శైలేంద్ర మనిషి శైలేంద్ర సైగ చెయ్యగానే.. మీరు ఫాదర్ గురించి గొప్పగా చెప్తున్నారు సర్ మీ ఫాదర్ మిమ్మల్ని బాగా పెంచారా సర్? మీ ఫాదర్ పేరు ఏంటని ఒకతను అడుగగానే‌‌.. మను షాక్ అవుతాడు. కాసేపు సైలెంట్ గా ఉంటాడు. చెప్పండి సర్ మీ తండ్రి పేరు తెలియదా.. మీ తల్లికి కూడా తెలియదా అని అతను అడుగుతాడు. దాంతో మను ఆవేశపడుతుంటే అందరు కంట్రోల్ మను అని అంటారు. అంతలో ఒకావిడ కలుగుజేసుకొని తల్లి అనుపమ గారు, తండ్రి ఎవరో తెలియదని అంటుంది.. నిజంగానే తండ్రి ఎవరో తెలియదా అని అతను అనగానే... నాకు నిజంగానే తెలియదు అని మను అంటుంటాడు. అప్పుడే మహేంద్ర వచ్చి మనుకి తండ్రి ఉన్నాడని అనగానే అందరు షాక్ అవుతారు. మరి ఎవరో చెప్పండని వాళ్ళు అనగానే.. మను తండ్రి నేనే అని మహేంద్ర అంటాడు. దాంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది ఇక వెళ్లొచ్చని మహేంద్ర అంటాడు. వసుధార అందరిని వెళ్ళమని చెప్తుంది.

ఆ తర్వాత అసలు నువ్వు అలా ఎందుకు చెప్పావ్? మను నీ కొడుకేంటి? నాకేం అర్థం కావడం లేదని మహేంద్రని ఫణీంద్ర అడుగుతాడు. చెప్పు సమాధానం చెప్పు అని దేవయాని అడుగుతుంది. నువ్వు చేసిన పనికి అందరు వెలెత్తి చూపిస్తారని మహేంద్రని దేవయాని నీలదీస్తుంది. మను నా కొడుకు.. అదొక్క సమాధానం తప్ప మహేంద్ర ఏం చెప్పడు. నువ్వు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదని ఫణీంద్ర అనేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్ర ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.