English | Telugu

ఓటింగ్ లో శివాజీ నెంబర్ వన్..  రెండో స్థానంలో ప్రశాంత్ !



బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ డ్రామా నడుస్తుంది. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల‌ మధ్య నామినేషన్ లో జరిగిన గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో శోభాశెట్టి సిల్లీ నామినేషన్ చూసి జనాలంతా తిడుతున్నారు.

అర్జున్ కన్నింగ్ గేమ్ వల్ల గౌతమ్ కృష్ణ వెళ్ళిపోయాడు. గత ఆరు వారాల నుండి ప్రేక్షకులు శోభాశెట్టిని ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేయకుండా ఉంటే బిగ్ బాస్ మామ.. దత్తపుత్రికని సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ శోభాశెట్టి కోసం బిగ్ బాస్ చేస్తున్న హైటెన్షన్ డ్రామా చూసిన జనాలు.. ఏందిరా సామి ఈ రచ్చ.. ఏ కుళ్లు, కుతంత్రాలు తెలియని యావర్ ని టార్గెట్ చేస్తారా ఏంటని అనుకుంటున్నారు. అందుకేనేమో ఓటింగ్ లో యావర్ ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నాడు. ప్రియాంక, శోభాశెట్టి అట్టడుగున ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. అయితే వారిద్దరి పైన అర్జున్, అమర్ దీప్ ఉన్నారు. అమర్ దీప్ కి పడే ఓట్లని చూస్తుంటే అవన్నీ పీఆర్ ఓట్లలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అమర్ దీప్ ఒక్క గేమ్ కూడా ఫెయిర్ గా ఆడింది లేదు. అయినా ఓట్లు పడుతున్నాయంటే అవి పీఆర్ స్టంట్సే అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ మామ ఈసారి అయిన ప్రేక్షకులు ఓసే ఓటింగ్ కి ప్రాముఖ్యత ఇచ్చి ప్రియంక, శోభాశెట్టిలలో ఎవరినో ఒకరిని ఎలిమినేట్ చేస్తాడా లేక వారిద్దరి కోసం యావర్ ని బలి చేస్తాడా చూడాలి.

ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ లో.. వంద శాతం ఓటింగ్ పడితే అందులో 60 శాతం ఓటింగ్ శివాజికి పడుతుంది. ఆ తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ కి 40 శాతం ఓటింగ్ పడుతుండగా.. మూడవ స్థానంలో ఉన్న అమర్ దీప్ కి 18 శాతం ఓటింగ్ పడుతుంది. ఇక ఆ తర్వాత 15 శాతం ఓటింగ్ తో యావర్ ఉన్నాడు. ఇక ప్రియాంక, శోభాశెట్టి లకి 5 నుండి 7 శాతం వరకు ఓటింగ్ పడుతుంది. అయితే బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్ ప్రకారం ప్రేక్షకుల ఓటింగ్ తో ఎవరైతే టాప్ లో ఉంటారో వారే విజేత. ఈ విషయాన్ని నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు. ఇదే జరిగితే నెంబర్ వన్ గా ఉన్న శివాజీనే విజేత వస్తుంది. రన్నరప్ గా ప్రశాంత్ కి వస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ వారంలో ఎవరు బయటకు వస్తారో చూడాలి మరి.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.