English | Telugu

బిగ్ బాస్ బజ్ యాంకర్ ఎవరో తెలిసిపోయింది...

సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే మొదలుకాబోతోంది. ఐతే బిగ్ బాస్ హోస్ట్ ఎవరో తెలుసు కానీ బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ ఎవరు అన్న టాపిక్ ఇప్పుడు అందరిలో ఉంది. ఐతే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా శివాజీ అన్నారు తర్వాత శోభా అన్నారు..ఇక ఇప్పుడు ఆడియన్స్ ఎదురుచూపులకు క్లారిటీ వచ్చేసింది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరో రివీల్ చేశారు. అందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. ఎవరూ ఊహించని పేరు చూసి షాకయ్యారు ఆడియన్స్. ఈసారి బిగ్ బాస్ బజ్ కి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ అంబటి అర్జున్ ని తీసుకున్నారు. అంబటి అర్జున్ చాలా క్లారిటీగా తప్పు చేస్తే ముఖం మీదే చెప్పే మైండ్ సెట్ ఉన్నవాడు. అలాటి వాళ్ళే బిగ్ బాస్ బజ్ కి వస్తే మంచి రేటింగ్ మంచి కాంట్రావర్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో అంబటి అర్జున్ కి స్వాగతం పలికారు. గత సీజన్స్ లో బిబి కేఫ్, బిగ్ బాస్ బజ్ ని అరియనా గ్లోరీ, శివ, రాహుల్ సిప్లిగంజ్, గీతూ రాయల్ వంటి వాళ్ళు చేశారు. ఇక ఇప్పుడు అంబటి అర్జున్ రాబోతున్నాడు.

ఇక ఈ ప్రోమోలో అంబటి హౌస్ మేట్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కనిపిస్తోంది. “టైమ్ బాగుంటే సంతోషం.. టైమ్ బాగోకపోతే సంకోచం. టైమ్ బాగుంటే మనం ఏం చేసినా ఒప్పు.. అలా టైమ్ బాగున్న కొంతమంది బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. మరి వాళ్ల టైమ్ బ్యాడ్ అయితే ? బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి.. ఈ సీటు యమ హాటు” అంటూ అంబటి అర్జున్ చెప్పిన డైలాగులు బాగా వైరల్ అవుతున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.