English | Telugu

బిగ్ బాస్ 5 స్టార్ట‌యింది.. ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు!

బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న 5వ సీజ‌న్ ఈరోజు (సెప్టెంబ‌ర్ 5) మొద‌లైంది. ఈ టాప్ రియాలిటీ గేమ్ షో స్టార్ మా చాన‌ల్‌లో సాయంత్రం 6 గంట‌ల‌కు తండ్రి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సూప‌ర్ హిట్ సాంగ్ 'ఒక లైలా కోసం' సాంగ్‌ను హోస్ట్ కింగ్ నాగార్జున‌ ప‌ర్ఫామ్ చేయ‌డంతో సూప‌ర్‌గా స్టార్ట‌యింది. ఆ త‌ర్వాత ఆడియెన్స్‌కు బిగ్ బాస్ హౌస్ లోప‌ల ఎలా ఉందో ప‌రిచ‌యం చేశారు నాగ్‌. డైనింగ్ హాల్‌, వాష్‌రూమ్‌, లివింగ్ రూమ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, మోజ్ అనే ఫ‌న్ రూమ్ లాంటివి అందులో ఉన్నాయి. ఈసారి హౌస్‌లోకి అత్య‌ధికంగా 19 మంది కంటెస్టెంట్లు వ‌చ్చారు.

ఫ‌స్ట్ కంటెస్టెంట్‌గా యాంక‌ర్‌, న‌టి సిరి హ‌న్మంత్ హౌస్‌లోకి అడుగుపెట్ట‌గా, ఆ త‌ర్వాత వ‌రుస‌గా టీవీ యాక్ట‌ర్ స‌న్నీ, ల‌హ‌రి ష‌హ్రీ, ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ శ్రీ‌రామ‌చంద్ర‌, కొరియోగ్రాఫ‌ర్ ఆనీ మాస్ట‌ర్‌, యాక్ట‌ర్ లోబో, సినీ-టీవీ న‌టి ప్రియ‌, మోడ‌ల్ జెస్సీ, ట్రాన్స్‌జెండ‌ర్ ప్రియాంకా సింగ్‌, పాపుల‌ర్ యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌, హ‌మీదా, డాన్స్ మాస్ట‌ర్ న‌ట‌రాజ్‌, టీవీ తార స‌ర‌యు రాయ్‌, యాక్ట‌ర్ విశ్వ, న‌టి ఉమాదేవి, యాక్ట‌ర్ మాన‌స్‌, ఆర్జే కాజ‌ల్‌, న‌టి శ్వేతావ‌ర్మ‌, యాంక‌ర్ ర‌వి.. హౌస్‌లోకి వ‌చ్చారు. తాము బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వ‌చ్చార‌న‌ది ప్ర‌తి కంటెస్టెంట్ వీడియో రూపంలో ప్ర‌జెంట్ చేశారు.

న‌ట‌రాజ్ భార్య ఏడ‌వ నెల గ‌ర్భ‌వ‌తి ఉంద‌నే విష‌యం తెలిసిన‌ప్పుడు ఎమోష‌న‌ల్ ఎట్మాస్ఫియ‌ర్ ఏర్ప‌డింది. అలాంటి స్థితిలో బిగ్ బాస్ హౌస్‌లోకి రావ‌డానికి అత‌ను వెనుకాడినా భార్య మాత్రం అత‌డిని వెళ్ల‌మంటూ తానే ఎంక‌రేజ్ చేశాన‌ని తెలిపింది. అందంగా క‌నిపించే ప్రియ‌లో త‌నేమిటో నిరూపించుకోవాల‌నే ఫైర్ ఉంద‌నీ, త‌న‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించ‌డానికి హౌస్‌లోకి వ‌చ్చింద‌నీ తెలిసింది. ఆనీ మాస్ట‌ర్ త‌న‌తో ఒక స్టెప్ వేయాల్సిందిగా నాగ్‌ను కోరితే, ఇప్పుడు కాదంటూ సున్నితంగా తిర‌స్క‌రించారు. ఉమాదేవి ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఎక్కువ‌గా క‌ష్టాల‌తో నిండివుంద‌ని విన్న‌ప్పుడు బాధ‌నిపించింది. కంటెస్టెంట్లు అంద‌రిలోకీ వ‌య‌సులో ఆమే పెద్ద‌ది.

ఫ‌స్ట్ ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్ల ప‌రిచ‌యంతోనే స‌రిపోయింది కాబట్టి, ఆడియెన్స్ ఎంజాయ్ చేయ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయింది. వాళ్ల‌కు సంబంధించిన ఏవీల‌లో చెప్పిన‌, చూపించిన విష‌యాలే కాస్త అల‌రించాయి, ఆక‌ట్టుకున్నాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.