Read more!

English | Telugu

ఆదర్శ్ రాడని భవాని ఎమోషనల్.. తనమీదే అనుమానపడిన కృష్ణ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో.. మధు ఎప్పటిలాగే రీల్స్ చేస్తూ బిజీగా ఉంటాడు. అప్పుడే మధు దగ్గరికి కృష్ణ వచ్చి.. ముకుంద గురించి మా చిన్నాన్నకి కూడా అర్థం అయిందని అనగానే అవునా ఏం అన్నాడని మధు అడుగుతాడు. నీ కాపురం చక్కదిద్దుకోమని చెప్పాడని కృష్ణ చెప్తుంది.

మరొకవైపు భవాని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ముకుంద తన నటన మొదలుపెడుతుంది. మీ దగ్గర ఒక విషయం దాచానని భవానికి మకుంద చెప్తుంది. ఏంటి ఏం చెప్పావ్ అని టెన్షన్ గా అడుగుతుంది. ఆదర్శ్ గురించి మీకు అబద్ధం చెప్పాం. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకీ ఈ న్యూస్ చెప్పి బాధపెట్టడం ఎందుకని మురారి వద్దని అన్నాడు. అసలు విషయం ఏంటంటే.. ఆదర్శ్ ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదట.

ఫోన్ వాడడం లేదట, ఇక ఇక్కడికి రాడట అంటూ ముకుంద ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ముకుంద మాటలు విని ఆదర్శ్ రాను అని అన్నాడ అంటూ భవాని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నాడు. ఈ విషయం చెప్పేటప్పుడు కావాలనే ఏసీపీ సర్ ఉండలేదా అని కృష్ణ ఆలోచిస్తుంది. అప్పుడే రేవతి కృష్ణ దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతుంది.. అసలు మురారితో  ముకుంద కలిసి ఎలా వచ్చింది మధ్య లో కలిసి ఏసీపీ సర్ తో వెళ్లిందా అని కృష్ణకి డౌట్ వస్తుంది. అసలు నిజం ఇంక కృష్ణకి తెలియదని అనుకొని.. అసలు నిజం తెలిస్తే కృష్ణ పరిస్థితి ఏంటో అని రేవతి అనుకుంటుంది.

మరొక వైపు మురారి, ముకుంద అన్న మాటలు గుర్తుకు చేసుకొని ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని రావాలని మురారి అనుకుంటాడు. మరొక వైపు ముకుంద గీతికతో ఫోన్ మాట్లాడుతుంది. అతను మనం చెప్పినట్టే చెప్పి మంచిగా నటించాడు. ఇక ఆదర్శ్ వస్తాడంటూ నన్ను ఎవరు టార్చర్ చెయ్యరని ఫోన్ లో ముకుంద మాట్లాడుతుంది. అప్పుడే కృష్ణ వస్తుంది. నా మాటలు కృష్ణ విన్నాదా అని‌ ముకుంద టెన్షన్ పడుతుంది. కానీ కృష్ణ వినదు.. ఆ తర్వాత నువ్వు చెప్పింది వింటే నాకు డౌట్ వస్తుంది. పైగా మురారి ఇంట్లో లేనప్పుడు ఈ విషయం చెప్పావ్. నాకు డౌట్ గా ఉందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌.