English | Telugu

ఆదర్శ్ రాడని భవాని ఎమోషనల్.. తనమీదే అనుమానపడిన కృష్ణ!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -285 లో.. మధు ఎప్పటిలాగే రీల్స్ చేస్తూ బిజీగా ఉంటాడు. అప్పుడే మధు దగ్గరికి కృష్ణ వచ్చి.. ముకుంద గురించి మా చిన్నాన్నకి కూడా అర్థం అయిందని అనగానే అవునా ఏం అన్నాడని మధు అడుగుతాడు. నీ కాపురం చక్కదిద్దుకోమని చెప్పాడని కృష్ణ చెప్తుంది.

మరొకవైపు భవాని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ముకుంద తన నటన మొదలుపెడుతుంది. మీ దగ్గర ఒక విషయం దాచానని భవానికి మకుంద చెప్తుంది. ఏంటి ఏం చెప్పావ్ అని టెన్షన్ గా అడుగుతుంది. ఆదర్శ్ గురించి మీకు అబద్ధం చెప్పాం. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకీ ఈ న్యూస్ చెప్పి బాధపెట్టడం ఎందుకని మురారి వద్దని అన్నాడు. అసలు విషయం ఏంటంటే.. ఆదర్శ్ ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదట.

ఫోన్ వాడడం లేదట, ఇక ఇక్కడికి రాడట అంటూ ముకుంద ఏడుస్తున్నట్లు నటిస్తుంది. ముకుంద మాటలు విని ఆదర్శ్ రాను అని అన్నాడ అంటూ భవాని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి ఏసీపీ సర్ ఎక్కడ ఉన్నాడు. ఈ విషయం చెప్పేటప్పుడు కావాలనే ఏసీపీ సర్ ఉండలేదా అని కృష్ణ ఆలోచిస్తుంది. అప్పుడే రేవతి కృష్ణ దగ్గరికి వచ్చి.. ఏమైందని అడుగుతుంది.. అసలు మురారితో ముకుంద కలిసి ఎలా వచ్చింది మధ్య లో కలిసి ఏసీపీ సర్ తో వెళ్లిందా అని కృష్ణకి డౌట్ వస్తుంది. అసలు నిజం ఇంక కృష్ణకి తెలియదని అనుకొని.. అసలు నిజం తెలిస్తే కృష్ణ పరిస్థితి ఏంటో అని రేవతి అనుకుంటుంది.

మరొక వైపు మురారి, ముకుంద అన్న మాటలు గుర్తుకు చేసుకొని ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని రావాలని మురారి అనుకుంటాడు. మరొక వైపు ముకుంద గీతికతో ఫోన్ మాట్లాడుతుంది. అతను మనం చెప్పినట్టే చెప్పి మంచిగా నటించాడు. ఇక ఆదర్శ్ వస్తాడంటూ నన్ను ఎవరు టార్చర్ చెయ్యరని ఫోన్ లో ముకుంద మాట్లాడుతుంది. అప్పుడే కృష్ణ వస్తుంది. నా మాటలు కృష్ణ విన్నాదా అని‌ ముకుంద టెన్షన్ పడుతుంది. కానీ కృష్ణ వినదు.. ఆ తర్వాత నువ్వు చెప్పింది వింటే నాకు డౌట్ వస్తుంది. పైగా మురారి ఇంట్లో లేనప్పుడు ఈ విషయం చెప్పావ్. నాకు డౌట్ గా ఉందని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ‌.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.