English | Telugu

మాన్సీకి చుక్క‌లు చూపించిన అను

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. విజ‌య‌వంత‌మైన మ‌రాఠీ సీరియ‌ల్ `తుల‌ఫ‌టేరే` ఆధారంగా తెలుగులో న‌టుడు, `బొమ్మ‌రిల్లు` ఫేమ్ శ్రీ‌రామ్ వెంక‌ట్ న‌టించి నిర్మించారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ గ‌త జ‌న్మ‌ల ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో రూపొందింది. కీల‌క పాత్ర‌లో క‌న్న‌డ న‌టి వ‌ర్ష న‌టించింది. రాజ‌నందిని ఆత్మ ఆర్య కోసం త‌పించే ఫాంట‌సీ క‌థ నేప‌థ్యంలో రూపొందిన ఈ సీరియ‌ల్ గ‌త ఏడాది కాలంగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

మంగ‌ళ‌వారం రాత్రి ఎపిసోడ్ హైలైట్స్ ఒక‌సారి చూద్దాం. గాఢ నిద్ర‌లో వున్న అను వెంట‌నే లేచి రాజ‌నందిని రూమ్‌లోకి వెళుతుంది. గ‌దిలోకి వెళ్లాక అను నుంచి రాజ నందిని ఆత్మ బ‌య‌టికి వ‌స్తుంది. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ అయిన అను ఎవ‌రు మీరు అని అడుగుతుంది. అను క‌ళ్ల ముందున్న ఆత్మ నా పేరు రాజ‌నందిని అని చెబుతుంది. నేనే నువ్వు.. నువ్వే నేను అని చెప్ప‌డంతో అను కొంత క‌న్ప్యూజ‌న్‌కి గుర‌వుతుంది. మ‌రి మిమ్మ‌ల్ని ఏం చేశార‌ని అను అడిగితే చంపేశార‌ని, నా లాగే నిన్ను కూడా అంతం చేయాల‌ని చూస్తున్నార‌ని చెబుతుంది రాజ‌నందిని.

ఇదిలా వుంటే అను... రాజ‌నందిని గ‌దిలోకి వెళ్లిన విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మాన్సీ ఎలాగైనా అనుని అంద‌రి ముందు దోషిగా నిల‌బెట్టాల‌ని ప్లాన్ చేస్తుంది. వెంట‌నే డోర్ లాక్ చేసేసి అంద‌రిని వెళ్లి పిల‌వాల‌ని వెళ్ల‌బోతుంది. ఇంత‌లో అను వెళ్లిపోతే ఇంత వ‌ర‌కు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా అని అక్క‌డే కాప‌లా కాస్తూ వుంటుంది. క‌ట్ చేస్తే రాజ నందిని త‌ను వ‌చ్చిన విష‌యం మ‌ర్చిపోతావ‌ని, అలా అయితే నిన్ను కూడా కాపాడ‌టం క‌ష్టం అవుతుంద‌ని అనుకి చెప్పి గుర్తుల కోసం ఓ డైరీలో రాసుకోమంటుంది. అలా డైరీలో రాసుకుని గ‌దిలోంచి బ‌య‌టికి వ‌చ్చేస్తుంది అను. అయితే అనులో రాజ‌నందిని ఆత్మ అలాగే వుంటుంది. ఈ విష‌యం తెలియ‌ని మాన్సీ.. అను రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయావ‌ని, ఈ విష‌యాన్ని అంద‌రికి చెప్పేస్తానంటుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అను .. మాన్సీకి చుక్కులు చూపించేస్తుంది. మంగ‌ళ వారం జ‌రిగిన ఈ ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.