English | Telugu

మన కష్టాలు చెప్తే మీద చేతులేసేవాళ్ళే ఎక్కువ..!

సౌమ్య బుల్లితెర యాంకర్ గా కొంతకాలం చేసింది. ఇప్పుడు ఢీ షోకి మెంటార్ గా ఆదితో కలిసి వస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలు చెప్పింది.

"మా నాన్న మా ఊరిలో అన్నీ అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్నాయన బాగున్నారు. కానీ మేము బలైపోయాం. అప్పులు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసేవాళ్ళు. అమ్మకి భయం చాలా ఎక్కువ..ఎం చేయాలో తెలిసేది కాదు. అప్పట్లో మా ఇంటిని నడిపింది నేను. చదువుకుంటూనే జాబ్స్ చేసాను. వాటితోనే ఇల్లు గడిచేది. ఇంటికి చుట్టాలు వస్తే పాలు, కాఫీ పొడి కోసం అమ్మ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్తుందని వాళ్ళు తలుపులు వేసుకునేవారు. చుట్టాల పెళ్లిళ్లకు వెళ్తే మంచి చీర, నగలు లేవు అని మా అమ్మను వెనక్కి చివరన కూర్చోబెట్టేవాళ్ళు. నేను న్యూస్ రీడర్ గా పని చేసాను. అలాగే ఒక లాయర్ దగ్గర పని చేశా. అక్కడ నా కష్టాలు తెలిసి జాబ్ ఇంపార్టెంట్ అని తెలిసి ఆ లాయర్ నా భుజాల మీద చేతులు వేసేవాడు. టచ్ చేసేవాడు. ఎక్కడా కూడా మనకు కష్టాలు ఉన్నాయని చెప్పుకోకూడదు. నువ్వు లేకపోయినా నేను బతగ్గలను అనేలా ఉండాలి. ఈ టెన్షన్స్ మధ్య అమ్మకు బ్రెయిన్ కాన్సర్ వచ్చింది.

మంచి ఫాదర్ మంచి ఫామిలీ ఉండడం కూడా ఒక తలరాత..మా నాన్న చేసిన పనికి అమ్మ మమ్మల్ని తిరుపతి తీసుకెళ్లింది. బస్ స్టాండ్ లో రెండు రోజులు తిండి లేకుండా ఉన్నా. ఎవరైనా కొంచెం అన్నం పెడతారేమో అని ఎంతలా ఎదురు చూశానో చెప్పలేను. ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు నాకు చిన్నపిల్లలను చూస్తే పెద్దగా ఫీలింగ్ రాదు. వాళ్లకు భవిష్యత్తు ఉంది. కానీ ముసలి వాళ్ళను చూస్తే బాధేస్తుంది. ఇది కలియుగం.. ఎవరినీ ఏమీ అనలేము. ఇలాంటి కాలంలో ఖర్మ, ధర్మంని అనుసరించి బతకాలి. మనం ఒకరికి చెడు చేస్తే మనకు తిరిగి వస్తుంది." అంటూ లైఫ్ గురించి ఖర్మ గురించి చెప్పుకొచ్చింది సౌమ్య.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.