English | Telugu

'బిగ్ బాస్ 5'లో సీరియల్ హీరోయిన్!

ఇప్పటివరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈసారి పేరున్న సెలబ్రిటీలను తీసుకొచ్చి హైప్ పెంచాలని చూస్తోంది బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల పేర్లను పరిశీలించారు. కామెడీని పండించడానికి ఒకరు, గ్లామర్ షో చేయడానికి మరొకరు, ఫైర్ బ్రాండ్ లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్లని ఇలా అన్ని ఎమోషన్స్ ను పండించేవారిని ఒక్కొక్కరిగా ఎంపిక చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా బుల్లితెర నటి, యాంకర్ సిరి హన్మంత్ కూడా బిగ్ బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి ఆ తరువాత సీరియల్స్ వైపు అడుగులేసింది.

పలు షోలకు హాజరవుతూ ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకుంటున్న ఆమెకి బిగ్ బాస్ షో నుండి కాల్ వచ్చిందట. అయితే ఈ విషయంలో ఆమె ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మరి ఈ ఆఫర్‌ను ఆమె ఒప్పుకుంటుందో లేదో చూడాలి. మరోపక్క హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ లోబోను కూడా ఈ షోలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.