English | Telugu

మోక్షతో దొరికిపోయిన విష్ణు ప్రియ.. డబ్బుకోసమే ఇలా చేసిందా?

బిగ్ బాస్ సీజన్-8 మొదలైన రెండో రోజు నుండే ట్రోలింగ్ మొదలైంది. ఎంతలా అంటే లోపలికి వెళ్ళే ముందు కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలని తీసుకొని సోషల్ మీడియాలోని కొంతమంది మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. అందులో మొదటగా విష్ణుప్రియ చేరింది.

విష్ణుప్రియ, రీతు చౌదరి ఇద్దరు బిగ్ బాస్ లోకి వెళ్తారనే టాక్ నిన్నటిదాకా వినిపించింది. ఇక నిన్నటితో విష్ణుప్రియ ఒక్కతే కన్ఫమ్ అని తేలిపోయింది. అయితే బిగ్ బాస్ కి వెళ్ళేముందు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో .. తనకి బిగ్ బాస్ అంటే ఇష్టం లేదని, అసలు వెళ్ళనని చెప్పింది. తనేం అందంటే.. ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను.. బయట ప్రపంచం చాలా అందంగా ఉంది.. అలాంటప్పుడు ఒక ఇంట్లోనే ఎందుకు ఉండాలి.. మన ఇంట్లో వాళ్లుంటారు.. వాళ్లని చూసుకోవాలి.. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాను.. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు.. నేను అసలు ఆ షోని కూడా ఎంకరేజ్ చేయను.. మీకు లిఖిత పూర్వకంగా రాసిస్తాను.. నేను ఎప్పుడూ ఆ షోకి వెళ్లనంటూ విష్ణు ప్రియ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విష్ణుప్రియ అంత మాట్లాడి..ఇప్పుడు ఎందుకు వెళ్లిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. డబ్బు కోసమే వెళ్లి ఉంటుందని కొందరు అంటున్నారు. అయితే విష్ణుప్రియ స్టేజ్ మీద మాత్రం ఇంకోలా చెప్పింది. గత సీజన్ నుంచే తాను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగా ఓ విజన్ వచ్చిందని చెప్పేసింది. విష్ణుప్రియ బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడు విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.

ఇక విష్ణుతో పాటు నాగపంచమి సీరియల్‌లో మోక్ష అనే క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పృథ్వీ శెట్టి కూడా బిగ్‌బాస్‌కి ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్టైలిష్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన పృథ్వీని యాంకర్ విష్ణుతో కలిపి జంటగా హౌస్‌లోకి నాగార్జున పంపిచాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.