English | Telugu

గాజులు చేతులకు వేసుకోవాలి.. చెవులకు పెట్టుకోకూడదు!

అనసూయ స్మాల్ స్క్రీన్ పై ఫుల్ ఫేమస్ యాంకర్. అంతేకాదు ఆమె ఆల్‌రౌండర్ కూడా. ఈమె చేసే క్యారెక్టర్స్ చూస్తే ఈమె స్పెషాలిటీ ఏమిటో అర్థమైపోతుంది. ఐతే అనసూయ ఇటీవల జబర్దస్ షోకి బై బై చెప్పేసింది. కాగా లేటెస్ట్‌గా కొన్ని మూమెంట్స్ ని బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది అనసూయ. పొట్టి నిక్కర్ వేసుకుని బీచ్ మొత్తాన్ని చుట్టేస్తోంది. అనసూయ ఎక్కడ ఉంటే అక్కడ అందం ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు బీచ్ కి వెళ్లి తన అందాన్ని సముద్రానికి కాస్త అంటించిందా లేదా సముద్రం అందాన్ని తానే కొంచెం పూసుకుందా అన్నట్టు ఉంది.

సముద్రం అందంగా ప్రవహిస్తుంటే అనసూయ చలాకీగా అల్లరి చేస్తోంది. "నన్ను చూసేసరికి సముద్రం ఎగసెగసి పడుతోంది. సముద్రం నన్ను మిస్సయిందేమో అనిపిస్తోంది" అన్నట్టుగా కాప్షన్ పెట్టి బీచ్ ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందరూ సూపర్ అని కామెంట్ చేస్తుంటే ఒక నెటిజన్ మాత్రం "నైస్ చెడ్డి .. కొత్తదా" అంటూ ఒక సెటైరికల్ కామెంట్ చేసాడు.

అనసూయ పెట్టుకున్న చెవి పోగులు గాజుల్లా ఉండేసరికి మరో నెటిజన్ ఐతే "గాజులు చేతులకు వేసుకోవాలి కానీ చెవులకు పెట్టుకోకూడదు" అంటూ కామెంట్ చేసాడు. ఇక రంగమ్మత్త మాత్రం ఎప్పుడూ ఎవరి కామెంట్స్ కి రెస్పాండ్ అవదు. తన పని తాను చేసుకు పోతుంది. సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది అనసూయ. రోల్ నచ్చి బోల్డ్ గా ఉంది అనుకుంటే తప్పనిసరిగా చేసేస్తుంది. సినిమా ఆఫర్స్ తో పాటు స్టార్ మాలో తనకు నచ్చిన ఆఫర్ వచ్చేసరికి అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.