English | Telugu

ఇంకెన్ని డిజాస్ట‌ర్స్ సంభ‌వించాలి.. అన‌సూయ ఫైర్‌!

ఉత్త‌రాఖండ్‌లో హిమానీన‌దం కార‌ణంగా ధౌలిగంగా న‌ది ఉధృతంగా పోటెత్త‌డంతో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఎన్‌టీపీసీ నిర్మిస్తోన్న రిషిగంగ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంస‌మైంది. ఆ ప్ర‌కృతి వైప‌రీత్యానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఆదివారం నుంచీ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విషాద‌మేమంటే ఆ ప్రాజెక్టులో ప‌నిచేస్తున్న దాదాపు 170 మంది సిబ్బంది గ‌ల్లంత‌యిపోయారు. వారిలో ఎంత‌మంది మృత్యువాత‌ప‌డ్డారు, ఎంత‌మంది ప్రాణాలు ద‌క్కించుకున్నార‌నే విష‌యం ఇంకా వెల్ల‌డి కాలేదు.

ఈ విషాదం అంద‌రినీ క‌దిలించి వేస్తోంది.. అంద‌రి హృద‌యాల‌నీ క‌ల‌చివేస్తోంది. ఈ ఉత్పాతానికి ఎవ‌రు బాధ్యులంటూ ప‌లువురు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌కృతిని ధ్వంసం చేస్తూ రావ‌డం వ‌ల్లే ఇలాంటి వైప‌రీత్యాలు ఎదుర‌వుతున్నాయ‌ని విమ‌ర్శిస్తున్నారు.

మ‌న ఫైర్ బ్రాండ్ యాంక‌ర్ అన‌సూయ భ‌రద్వాజ్ సైతం ఈ విషాదంపై త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. "మ‌రో ప్ర‌కృతి వైప‌రీత్యం మ‌న‌ల్ని తాకింది. ఇది మ‌నం ప్ర‌కృతికి అనుగుణంగా జీవిస్తూ, దానిని సంర‌క్షించడం మొద‌లుపెట్టాల్సిన స‌మ‌యం కాదా? మ‌నం నేర్చుకోవ‌డానికి ముందు ఇంకెన్ని ఉత్పాతాలు సంభ‌వించాలి?" అంటూ ఆమె ఆగ్ర‌హంతో ప్ర‌శ్నించింది.

హిమాల‌యాల‌పై కాంక్రీట్ నిర్మాణాలు పెరుగుతుండ‌టం వ‌ల్ల ఆ ప‌ర్వ‌తాలు చాలా వేగంగా వేడెక్కుతున్నాయ‌ని పర్యావ‌ర‌ణ‌వేత్త‌లు చెబుతున్నారు. దాని వ‌ల్లే మంచు చ‌రియ‌లు క‌రిగి, విరిగి ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వాలు కూడా దీనికి బాధ్య‌త వ‌హించాలంటున్నారు.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.