English | Telugu

'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' స్టేజ్‌పై ఇమ్మానియేల్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌!

ఈటీవీలో 'జ‌బ‌ర్ద‌స్త్' త‌రువాత‌ అంత‌గా పాపుల‌ర్ అయిన షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షో'. ఈ షోకి న్యాయ నిర్ణేత‌లుగా రోజా, మ‌నో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షోలో వ‌ర్షని స్టేజ్‌పైనే ఇమ్మానియేల్ ప్ర‌పోజ్ చేయ‌డం అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ షో లేటెస్ట్ ప్రోమోలో ఫిబ్ర‌వ‌రి 14 వేలంటైన్స్ డే సంద‌ర్భంగా చేతిలో ఒక‌సారి రెడ్ క‌ల‌ర్ హార్ట్ సింబ‌ల్ బెలూన్‌ని ప‌ట్టుకుని, ఇంకోసారి చేతిలో గులాబీ పువ్వు ప‌ట్టుకుని ఇమ్మానియేల్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ మోకాళ్ల‌పై కూర్చుని ప్ర‌పోజ్ చేసిన తీరు వైర‌ల్‌గా మారింది.

ఈ దృశ్యం చూసి రోజా అవాక్క‌యింది. ఫిబ్ర‌వ‌రి 12న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. వ‌ర్ష కూడా సిగ్గుల మొగ్గ‌వుతూ ఇమ్మానియేల్ ఇచ్చిన‌ రోజా పువ్వుని అందుకోవ‌డం ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఇమ్మానియేల్ భావోద్వేగానికి లోన‌య్యాడు. చాలా మంది అమ్మాయిలు త‌న ప‌క్క‌న నించోవ‌డానికే ఇష్ట‌ప‌డ‌లేద‌ని, అలాంటిది వ‌ర్ష మాత్రం త‌న‌తో స‌న్నిహితంగా వుంద‌నీ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

వ‌ర్ష 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్'లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌గ్గ‌రి నుంచి ఇమ్మానియేల్ తో స‌న్నిహితంగా వుంటోంది. వీరిద్ద‌రిపై గ‌త కొన్ని రోజులుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశం జ‌ర‌గ‌డం, ప్రేమికుల రోజు సంద‌ర్భంగా చిత్రీక‌రించిన ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ షోలో జ‌డ్జెస్ సాక్షిగా ఇమ్మానియేల్ .. వ‌ర్ష‌కు ప్ర‌పోజ్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.ఫిబ్ర‌వ‌రి 12న ఈ ఎపిసోడ్ ప్ర‌సారం కానున్న‌ది.

ట్రెండింగ్ లో కావ్య, సుధీర్ జోడి.. మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ తో వివాహ యోగం

ఆట గ్రాండ్ లాంఛ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో ఉన్న కావ్య మీద సుధీర్, సుధీర్ మీద నిహారిక ఫుల్ సెటైర్స్ వేసుకున్నారు. "మీ గురించి రికమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను. ఎలాగున్నా నాకు మంచి పేరు తేవాలి" అన్నాడు. దాంతో కావ్య ఏమీ తెలీనట్టు నవ్వింది. ఆమెను చూసి జానీ మాష్టర్ నవ్వాడు. ఇక సుధీర్ ఆమె గురించి ఒక పెద్ద బయోడేటా లిస్ట్ రాసుకొచ్చాడు. "పేరు కావ్యశ్రీ, ముద్దుపేరు నడిచే తాజ్ మహల్, ఎగిరే ఎల్లోరా, కదిలే కాశ్మీర్" అన్నాడు. వెంటనే నిహారిక "అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్" అనేసరికి సుధీర్ షాకయ్యాడు. 

Brahmamudi : మినిస్టర్ కి ఎదురుతిరిగిన కావ్య.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -943 లో..... కావ్య తన కూతురు మినిస్టర్ దగ్గర ఉందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మినిస్టర్ తో గొడవపడుతుంది. నా బిడ్డని నాకెందుకు దూరం చేశారని కావ్య అడుగుతుంది. ఓహ్ నిజం తెలిసిపోయిందా నా బిడ్డ అనారోగ్యంగా ఉందని నా భార్యకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే బిడ్డని మార్చేసాను.. అయిన నీ బిడ్డ అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా.. లేదు కదా.. నీ బిడ్డని నీకు ఇచ్చే ప్రసక్తే లేదని కావ్యతో మినిస్టర్ అంటాడు. నా బిడ్డని పదిహేను రోజుల్లో నా దగ్గరికి చేర్చుకుంటానని మినిస్టర్ కి కావ్య వార్నింగ్ ఇస్తుంది.