English | Telugu

శివాజీ ఫెయిర్ నామినేషన్.. అమర్ దీప్ బూతులతో మరోసారి!

బిగ్ బాస్ సీజన్-7 లో సోమవారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది అన్నట్టుగా ఒకరినొకరు తిట్టుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అయితే ఈ నామినేషన్ లో కొన్ని రీజన్స్ సిల్లీగా అనిపించాయి.

నామినేషన్ ప్రక్రియని మొదలుపెట్టిన పల్లవి ప్రశాంత్.. అమర్ దీప్ ని నామినేట్ చేసాడు. రతిక, భోలే షావలిని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది. శోభాశెట్టి, అమర్ దీప్ లని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత రతిక వచ్చి ప్రియాంక జైన్, శోభాశెట్టిలని నామినేట్ చేసింది. నన్ను బాంబ్ అని అనడం, ఒకరి దగ్గర ఆగిపోయావని అనడం నాకు నచ్చలేదంటూ అందుకే నామినేట్ చేస్తున్నానని ప్రియాంకతో రతిక అంది.

ఆ తర్వాత అమర్ దీప్ ని భోలే షావలి నామినేట్ చేశాడు. ఆ రోజు నామినేషన్ లో నువ్వు నన్ను మధ్యలో మాట్లాడొద్దని పగిలిపోద్ది అని చెప్పి కుర్చీని బాగా తన్నావ్. ఆ బూతు మాట్లాడం కరెక్ట్ కాదని అది నాకు నచ్చలేదని అమర్ దీప్ తో భోలే షావలి అనగా.. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అలా వచ్చిందని అమర్ దీప్ అన్నాడు. ఇక వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధంలో అమర్ దీప్ మళ్ళీ నోరుజారాడు. అది విన్న ప్రియాంక.. ఏది పడితే అది మాట్లాడొద్దు, ఆ తర్వాత సారీ చెప్పొద్దు. ప్రతీసారీ అదే చేయొద్దని అమర్ దీప్ తో ప్రియాంక అంది‌. నేను మాట్లాడింది బూతు కాదు. ఆయన చెప్పింది కరెక్ట్ అని అనొద్దు. నా కోపం ఇంతే ఎవరి కోసం నన్ను నేను మార్చుకోను. అది నాకు బూతు కాదని అమర్ దీప్ అనగా.. మాకు అది బూతు అనిపిస్తుందని ప్రియాంక అంది.

గొప్ప ప్లేయర్ వెళ్ళిపోయాడు. తేజ నువ్వు తప్పు చేశావ్. నువ్వు ఆ రోజు నామినేట్ చేయడం వల్ల ఆట సందీప్ వెళ్ళిపోయాడు. ఒక గొప్ప ప్లేయర్ వెళ్ళిపోయాడనే బాధ నాకు ఉంది. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నానని టేస్టీ తేజని శివాజీ నామినేట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ.. అంబటి అర్జున్, రతికలని నామినేట్ చేశాడు. మూడు వారాలుగా అర్జున్ ఒక్కసారి కూడా నామినేషన్ లో లేడు. అందుకే పాజిటివ్ వైబ్స్ తో నామినేట్ చేస్తున్నానని టేస్టీ తేజ అనడంతో హౌస్ లోని వాళ్ళంతా నవ్వుకున్నారు. గతవారం ఆట సందీప్ ని కూడా ఇలాగే నామినేట్ చేయడంతో అతను ఎలిమినేట్ అయ్యాడని హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. టేస్టీ తేజ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ అంటూ అంబటి అర్జున్ కామెడీ చేయగా.. నీకు నేను చెప్పింది ఇష్టమైతేనే ఒప్పుకోమని టేస్టీ తేజ బతిమాలాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.