English | Telugu

ఇండ‌స్ట్రీలో తెలుగువాళ్లంటే చిన్నచూపు.. ప్రశాంతి ఆవేద‌న‌!

స్టార్ మా ఛానెల్ లో ప్రసారం అవుతోన్న 'గృహలక్ష్మి' సీరియల్‌కు మంచి టీఆర్పీ వ‌స్తోంది. ఇందులో లాస్య అనే నెగెటివ్ రోల్‌లో యాంకర్ ప్రశాంతి నటిస్తున్నారు. లాస్య క్యారెక్టర్‌కు ఆమె ఆమె పెర్ఫెక్ట్ గా సూటయ్యిందనే పేరొచ్చింది. ఒకప్పుడు టీవీ ఛానెల్స్‌లో యాంకర్ గా ఆమె సత్తా చూపించారు. తెలుగింటి అమ్మాయి అయిన ప్రశాంతి.. ఇండస్ట్రీలో అవకాశాల కోసం గట్టిగానే కష్టపడ్డారు.

ఫైనల్‌గా 'గృహలక్ష్మి' సీరియల్ తో నటిగా తనను తాను నిరూపించుకున్న ప్రశాంతి తాజాగా ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు వాళ్లలో చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ఉన్నారని.. వాళ్లందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యాలే అవుతారని అన్నారు. కానీ అవకాశం లేక చాలా మంది తమ టాలెంట్‌ని చంపుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కొంతమంది అవకాశాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారని.. ఇవన్నీ ఒక్కోసారి చూస్తుంటే బాధగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. బయట రాష్ట్రాల నుండి తెలుగు ఇండస్ట్రీకి రావాలనుకే వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారని, కానీ తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరని వాపోయారు. ముందు తెలుగు వాళ్లను ప్రోత్సహించాలని.. చాలా మంది టాలెంటెడ్ వాళ్లు ఉన్నారని ప్ర‌శాంతి అన్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.